News March 12, 2025
గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేందుకు మేస్త్రీలు శిక్షణను సమర్థవంతంగా ఉపయోగించుకుని తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం పాత కలెక్టర్ కార్యాలయం వెనక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్తో కలిసి నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
కర్నూలు జిల్లా రైతులకు దిత్వా భయం

కర్నూలు జిల్లా రైతులను దిత్వా తుఫాను భయపెడుతోంది. చేతికొచ్చిన వరి పంట నేలకొరిగితే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీగా పెట్టుబడి పెట్టిన రైతులు దిగాలు చేస్తున్నారు. ఒక్క పెద్దకడబూరు మండల పరిధిలోనే సుమారు 3వేల ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం తుఫాను ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.
News December 1, 2025
NGKL: అరుణాచలం, కాణిపాకానికి ప్రత్యేక బస్సు

పౌర్ణమి పురస్కరించుకొని డిసెంబర్ 3న రాత్రి 8 గంటలకు అరుణాచలం గిరిప్రదర్శన కు నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈనెల 4వ తేదీన ఉదయం కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, దర్శనం అనంతరం 5వ తేదీ అరుణాచలం గిరి ప్రదక్షిణ, దర్శనం ఉంటుందని తెలిపారు. వివరాలకు 9490411590, 9490411591, 7382827527ను సంప్రదించాలని కోరారు.
News December 1, 2025
NTR: రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక

రెవెన్యూ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులను అమరావతి భూసమీకరణ విధులలో భాగం చేసేందుకు CRDA సన్నద్ధమైంది. CRDAలో డిప్యూటీ కలెక్టర్లు(7), తహశీల్దార్(5), డిప్యూటీ తహశీల్దార్(5) ఉద్యోగాలకు రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు DEC 2లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలని, ఇదే వెబ్సైట్లోని కెరీర్స్ ట్యాబ్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


