News March 12, 2025

గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేందుకు మేస్త్రీలు శిక్షణను సమర్థవంతంగా ఉపయోగించుకుని తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం పాత కలెక్టర్ కార్యాలయం వెనక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌తో కలిసి నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

Similar News

News March 23, 2025

ఆదిలాబాద్‌: రేపటి నుంచి 6రోజుల పాటు శిక్షణ

image

ఆదిలాబాద్‌లోని TTDCలో విపత్తు నిర్వహణపై ఈ నెల 24 నుంచి 29 వరకు మర్రి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18 నుంచి 40 సం.రాల వయస్సు లోపు పది పాసైన 50 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టిఫిన్, భోజనం ఖర్చులకు వంద రూపాయలతో పాటు రాత్రి వసతి కూడా ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

News March 23, 2025

కరప: భర్త, ఇద్దరు కొడుకులు చనిపోవడంతో మహిళ సూసైడ్ 

image

కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన బరగటి లక్ష్మి (59) ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి సంతానం. 2019లో భర్త, 2021లో చిన్న కొడుకు, 2023లో పెద్దకొడుకు, 2024లో అల్లుడు చనిపోయారు. ఆమె ఒంటరిగా వేలంగిలో ఉంటోంది. మనస్తాపం చెంది ఆమె శనివారం తుల్యభాగలో దూకి మరణించిందని ఆమె మనవడు పోతురాజు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని వెలికి తీసి కరప ఎస్ఐ సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 23, 2025

గుంటుపల్లి: యువతి హత్య కేసులో నిందితులు వీరే

image

గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద 2019లో ప్రేమ జంటపై జరిగిన దాడి చేసి యువతి హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు శుక్రవారం జీవిత ఖైదు విధించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జి.కొండూరుకు చెందిన రాజు, జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య, గంగయ్య, అరిసెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. ఈ కేసును పోక్సో కేసుగా పరిగణించి నలుగురికి జీవిత ఖైదు విధించారు.

error: Content is protected !!