News March 20, 2025

గద్వాల: ఇసుక తవ్వకాలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్ 

image

గద్వాల జిల్లాలో ఇసుక సౌలభ్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం రాజోలి మండల పరిధిలోని తుమ్మిళ్లలో గుర్తించబడిన ఇసుక డీ-సిల్టేషన్ ప్రదేశాన్ని పరిశీలించారు. భౌగోళిక పరిస్థితులను స్వయంగా పరిశీలించి ఇసుక తవ్వకాలు,భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలు, పర్యావరణ పరిరక్షణ అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తవ్వకాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 27, 2025

కాస్త రిలీఫ్.. తగ్గిన బంగారం ధరలు

image

బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.1,140 తగ్గి రూ.1,24,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,050 దిగివచ్చి రూ.1,14,100గా ఉంది. ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు కాస్త తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ రూ.1,70,000గా ఉంది.

News October 27, 2025

నారాయణపేట: దారుణం.. తల్లిని చంపిన కొడుకు

image

నారాయనపేట జిల్లా కొత్తపల్లి మండలం గోకుల్‌ నగర్‌లో దారుణం జరిగింది. భీమమ్మ(65) అనే <<18115968>>వృద్ధురాలిని ఆమె చిన్న కుమారుడు రామకృష్ణ నరికి, బండరాయితో బాది చంపాడు<<>>. ఆదివారం అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న భీమమ్మను నిందితుడు పారతో నరికినట్లు కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. భీమమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 27, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వారం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 84,506 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు వృద్ధి చెంది 25,885 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. టాటా స్టీల్, రిలయన్స్, ఎయిర్‌టెల్, SBI, HDFC, టెక్ మహీంద్రా, NTPC, ICICI, యాక్సిస్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.