News March 18, 2025

గద్వాల కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్ల ధర్నా

image

పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ సెంటర్లని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదమ్మ ఏమేలమ్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలన్నారు.

Similar News

News November 14, 2025

ప్రారంభం కానున్న జెండర్ రిసోర్సు సెంటర్

image

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోవూరు, గుడ్లూరు, వెంకటాచలం, పొదలకూరు, కావలి, కలిగిరి, ఆత్మకూరు, రాపూరు మండలాల్లో ఈ నెల 20లోగా జెండర్ రిసోర్సు సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మహిళా ప్రతినిధులే ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. లైంగిక–వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు, హింస వంటి సమస్యలపై కౌన్సెలింగ్, న్యాయం, తక్షణ సాయం అందిస్తారు. ఒక్కో కేంద్రానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు.

News November 14, 2025

200 సీట్ల‌తో ఎన్డీయే గెల‌వ‌బోతుంది: CBN

image

AP: బిహార్‌లో ఎన్డీయే ఘ‌న విజ‌యం దిశగా దూసుకెళ్తుండటంపై CM చంద్ర‌బాబు స్పందించారు. విశాఖ CII పార్ట్‌నర్షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 200 సీట్ల‌తో ఎన్డీయే గెల‌వ‌బోతుందని అన్నారు. ప్ర‌జ‌లంతా PM మోదీ వైపే ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయన్నారు. దేశంలో ఇంత‌లా ప్ర‌జా న‌మ్మ‌కం పొందిన వ్య‌క్తి మోదీ త‌ప్ప మ‌రెవ‌రూ లేరని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ శతాబ్దం న‌రేంద్ర మోదీది అని కొనియాడారు.

News November 14, 2025

గోపీనాథ్ ‘లీడ్ బ్రేక్’ చేసిన నవీన్

image

జూబ్లీహిల్స్‌లో అంచనాలకు మించి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ఆయనకు 10 వేలకు అటు ఇటుగా మెజార్టీ రావచ్చని మెజార్టీ సర్వేలు చెప్పాయి. అయితే 9వ రౌండ్ ముగిసేసరికే 19వేల ఆధిక్యంలో ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో దివంగత MLA మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సెగ్మెంట్లో అత్యధిక మెజార్టీ రికార్డ్ విష్ణు (2009లో కాంగ్రెస్ నుంచి 21,741 లీడ్) పేరిట ఉంది.