News October 16, 2024
గద్వాల: కల్వర్ట్ను ఢీ కొట్టిన కారు.. మాజీ జడ్పీటీసీ కుమారుడు మృతి

రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ కుమారుడు మృతిచెందాడు. ఈ ఘటన మల్దకల్ మండలంలో బుధవారం జరిగింది. మల్దకల్ మండల మాజీ ZPTC పటేల్ అరుణ- ప్రభాకర్ రెడ్డి కుమారుడు రాంచంద్రారెడ్డి ఎర్రవల్లి నుంచి గద్వాల వెళ్తుండగా దయ్యాలవాగు వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతిచెందారు.
Similar News
News December 3, 2025
MBNR: పీయూలో ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్’ కార్యక్రమం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ ఆడిటోరియంలో ఈ నెల 6న నిర్వహించబోయే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్) కార్యక్రమం కరపత్రాన్ని వీసీ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ పి. రమేష్ బాబు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్తో కలిసి నిర్వహించనున్నారు.
News December 2, 2025
MBNR: సైబర్ నేరాలకు పాల్పడితే..1930కు ఫోన్ చేయండి

సైబర్ నేరాలకు బారిన పడినప్పుడు వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘Fraud Ku Full Stop’ అనే నినాదంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ ప్రతిజ్ఞ చేశారు. సైబర్ నేరాలు రోజు రోజుకూ రూపం మార్చుకుంటున్నాయి. ఒక్క క్లిక్తో పెద్ద నష్టం చోటుచేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలన్నారు.
News December 2, 2025
మహబూబ్నగర్: జిల్లా ఇన్స్పెక్షన్ ప్యానెల్కు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్నగర్ జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ల నుంచి జిల్లా ఇన్స్పెక్షన్ ప్యానెల్ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025 లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.


