News February 13, 2025
గద్వాల: కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడంతో పాటు,నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు అధికారులకు ఆదేశించారు. గురువారం గద్వాల మండలంలోని పుటాన్ పల్లి గ్రామంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(గర్ల్స్)ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో పరిస్థితులను సమీక్షించి, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
Similar News
News March 21, 2025
నల్గొండ: గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటిన యువతి

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరుకి చెందిన పోలగాని నరసింహ గౌడ్, వెంకాయమ్మ దంపతుల కుమార్తె శ్వేత గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటింది. గ్రూప్-1లో 467మార్కులు, గ్రూప్-2లో 412 స్టేట్ ర్యాంక్, గ్రూప్-3లో 272 ర్యాంక్ సాధించింది. 3 నెలల క్రితం గ్రూప్-4 ఉద్యోగం సాధించి అడవిదేవులపల్లి MRO ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తోంది. గ్రూప్స్లో సత్తా చాటడంతో పలువురు శ్వేతను అభినందిస్తున్నారు.
News March 21, 2025
IOC కొత్త ప్రెసిడెంట్గా కిర్స్టీ కోవెంట్రీ

ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా జింబాబ్వే స్విమ్మర్, పొలిటీషియన్ కిర్స్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. దీంతో IOC తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. గ్రీస్లో జరిగిన 144వ IOC సెషన్లో కమిటీ మెంబర్స్ ఆమెను ఎన్నుకున్నారు. ఈ సెషన్లో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జైషా ఆమెకు విషెస్ తెలిపారు. లాస్ ఏంజెలిస్-2028 ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 21, 2025
మెదక్: 10TH విద్యార్థులకు ALL THE BEST

టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు ఉమ్మడి మెదక్ కలెక్టర్లు మను చౌదరి, వల్లూరు క్రాంతి, రాహుల్ రాజ్ ఆల్ ద బెస్ట్ తెలిపారు. పరీక్షలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా అత్యంత జాగ్రత్తగా ఈ పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సెల్ఫోను అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్, అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.