News March 4, 2025

గద్వాల: కుటుంబ కలహాలతో మహిళ మృతి

image

మల్దకల్ మండలం అమరవాయికి చెందిన ఓ మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన బుచ్చమ్మ(42), జమ్మన్న దంపతులకు ముగ్గురు సంతానం. వీరు కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఇటీవలే కుమారుడి వివాహం చేయగా, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పాటు కుటుంబ కలహాలు ఉండటంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేనప్పుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Similar News

News March 4, 2025

హనుమకొండ: DANGER ప్లేస్.. మరో వ్యక్తి మృతి

image

హసన్‌పర్తి మండలం కోమటిపల్లిలోని నిరూప్ నగర్ తండా సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉనికిచర్ల ప్రధాన రహదారిపై ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన కడుగుల రవి(60) బైక్‌పై హనుమకొండ వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా గత ఆరు నెలల్లోనే సేమ్ ప్లేస్‌లో ఐదుగురు చనిపోవడం గమనార్హం.

News March 4, 2025

హనుమకొండ: DANGER ప్లేస్.. మరో వ్యక్తి మృతి 

image

హసన్‌పర్తి మండలం కోమటిపల్లిలోని నిరూప్ నగర్ తండా సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉనికిచర్ల ప్రధాన రహదారిపై ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన కడుగుల రవి(60) బైక్‌పై హనుమకొండ వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా గత ఆరు నెలల్లోనే సేమ్ ప్లేస్‌లో ఐదుగురు చనిపోవడం గమనార్హం. 

News March 4, 2025

విజ‌య‌వాడ‌: ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన కలెక్టర్ 

image

విజ‌య‌వాడ‌లోని బిష‌ప్ అజ‌ర‌య్య జూనియ‌ర్ క‌ళాశాల‌, శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర సిద్ధార్థ మ‌హిళా క‌ళాశాలలోని ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌్లో మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ త‌నిఖీ చేశారు. అనంతరం విద్యార్థులు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప‌రీక్ష‌లు రాసేందుకు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. వేస‌వి నేప‌థ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాల‌ని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన పలువురు అధికారులు ఉన్నారు. 

error: Content is protected !!