News April 3, 2025
గద్వాల: కొత్త పోలీస్ స్టేషన్లు వస్తున్నాయ్..!

గద్వాల నియోజకవర్గ పరిధిలోని కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం స్థలాలను ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. గద్వాల జిల్లా ఏర్పడిన నుంచి కేటీదొడ్డి మండలంలో అద్దె భవనంలో PS ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు పోలీస్ స్టేషన్ల కోసం ప్రభుత్వ స్థలాలను ఎస్పీ పరిశీలించారు. డీఎస్పీ, సీఐ తదితరులు ఉన్నారు.
Similar News
News October 15, 2025
జిల్లాలో 400 వరి కొనుగోలు కేంద్రాలు: వనపర్తి కలెక్టర్

బుధవారం ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుపై అధికారులతో వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి సమావేశమైయ్యారు. అక్టోబర్ చివరి వారం కల్లా రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయన్నారు. ఈసీజన్లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసేందుకు జిల్లాలో 400కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తూకపు యంత్రాలు, తేమ యంత్రాలను సరిచూసుకొని అందుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
News October 15, 2025
సీఎం ఆడిన మైదానం అభివృద్ధికి నిధులు: వనపర్తి ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జూనియర్ కాలేజీ మైదానంలో ఆటలు ఆడారని, మైదానం, అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. వనపర్తిలో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభంలో ఆయన మాట్లాడారు. ఇదే మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి ఆటలు ఆడారని, మైదానం అభివృద్ధికి రూ.50కోట్లు , జిమ్ స్విమ్మింగ్కు రూ.15కోట్లు మంజూరు చేశారన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయిన ప్రతిసారి పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించాలన్నారు.
News October 15, 2025
VJA: ‘సూపర్ జీఎస్టీ సేవింగ్స్ ఉత్సవాలను వినియోగించుకోండి’

పున్నమిఘాట్లో ఈ నెల 13న ప్రారంభమైన గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్లో ప్రతిరోజూ లక్కీడ్రా నిర్వహిస్తున్నామని జేసీ ఎస్. ఇలక్కియా తెలిపారు. ఫెస్టివల్ చివరి రోజు బంపర్ డ్రా తీసి విజేతకు స్కూటీ బహూకరిస్తామన్నారు. ఈ ఉత్సవాల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు తగ్గిన జీఎస్టీ రేట్లతో, ప్రత్యేక రాయితీలతో లభిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్శీశా, అధికారులు పాల్గొన్నారు.