News April 3, 2025
గద్వాల: కొత్త పోలీస్ స్టేషన్లు వస్తున్నాయ్..!

గద్వాల నియోజకవర్గ పరిధిలోని కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం స్థలాలను ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. గద్వాల జిల్లా ఏర్పడిన నుంచి కేటీదొడ్డి మండలంలో అద్దె భవనంలో PS ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు పోలీస్ స్టేషన్ల కోసం ప్రభుత్వ స్థలాలను ఎస్పీ పరిశీలించారు. డీఎస్పీ, సీఐ తదితరులు ఉన్నారు.
Similar News
News December 24, 2025
తిరుపతి: మహంతిగా అర్జన్ దాస్ తిరిగి వస్తాడా..?

తిరుపతిలోని శ్రీహథీరాంజీ మఠం మాజీ మహంతి అర్జున్ దాస్ తిరిగి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఆయనపై ఆరోపణల నేపథ్యంలో గతంలో ధార్మిక పరిషత్ ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని పై కోర్టులో కేసు జరుగుతుండగా తాజాగా సుప్రీం కోర్టులో అర్జున్ దాస్ తిరిగి పిటీషన్ దాఖలు చేశారు. ఇది త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
News December 24, 2025
అపరాల పంటల్లో బంగారు తీగ కలుపు నివారణ

అపరాల పంటలకు బంగారు తీగ కలుపు ముప్పు ఎక్కువ. అందుకే పంట విత్తిన వెంటనే ఎకరాకు 200L నీటిలో పెండిమిథాలిన్ 30% 1.25 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణిలో మినుము విత్తితే వరి పనలు తీసిన వెంటనే ఎకరాకు 1.25L పెండిమిథాలిన్ 30%ను 20KGల ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. అలాగే మినుము విత్తిన 20 రోజులకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200mlను కలిపి పిచికారీ చేసి బంగారు తీగ కలుపును నివారించవచ్చు.
News December 24, 2025
ఎన్టీఆర్ నుంచి బన్నీ వద్దకు త్రివిక్రమ్ ప్రాజెక్ట్?

త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ మళ్లీ అల్లు అర్జున్ వద్దకు వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కుమారస్వామి కథ ఆధారంగా తెరకెక్కే ఈ మూవీలో బన్నీ హీరోగా నటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. తర్వాత ఇది NTR వద్దకు చేరింది. కానీ తాజాగా మేకర్స్ ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ₹1000Crతో తీయబోయే ఈ మూవీ షూటింగ్ 2027 MARలో ప్రారంభమవుతుందని, త్వరలో అఫీషియల్ ప్రకటన వస్తుందని సమాచారం.


