News April 3, 2025

గద్వాల: కొత్త పోలీస్ స్టేషన్లు వస్తున్నాయ్..! 

image

గద్వాల నియోజకవర్గ పరిధిలోని కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం స్థలాలను ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. గద్వాల జిల్లా ఏర్పడిన నుంచి కేటీదొడ్డి మండలంలో అద్దె భవనంలో PS ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు పోలీస్ స్టేషన్ల కోసం ప్రభుత్వ స్థలాలను ఎస్పీ పరిశీలించారు. డీఎస్పీ, సీఐ తదితరులు ఉన్నారు.

Similar News

News December 7, 2025

తెలుగువారి పరువు పోయింది.. రామ్మోహన్ రాజీనామా చేయాలి: అమర్నాథ్

image

AP: ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మంత్రి రామ్మోహన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ‘చరిత్రలో ఈ తరహా ఇబ్బంది ఎదుర్కోవడం ఇదే తొలిసారి. దేశంలో తెలుగు వారి పరువు, ప్రపంచంలో ఇండియా పరువు పోయింది. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ సమయంలో ఆయన రీల్స్ చేసుకున్నారనే అపవాదులు వచ్చాయి. రామ్మోహన్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.

News December 7, 2025

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 15 నుంచి గుడివాడకు వందే భారత్

image

చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు ఈ నెల 15వ తేదీ నుంచి పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. అయితే నర్సాపురం, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వందే భారత్ రైలు నడపాలని ప్రయాణికుల కోరుతున్నారు.

News December 7, 2025

సిద్దిపేట: గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం

image

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామాల్లో మందు, విందులను అభ్యర్థులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. గతంలో గ్రామానికి 10 నుంచి 20 వరకు బెల్టుషాపులు ఉండేవి. ప్రస్తుత జిల్లా సీపీ ఎస్ఎం విజయ్ కుమార్ బెల్టుషాపులను నియంత్రణలోకి తేవడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున వైన్ షాపుల బాట పట్టారు. ప్రత్యేకంగా డంపు చేసి, మందుబాబులకు అందిస్తున్నారు.