News March 12, 2025

గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

image

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.

Similar News

News March 13, 2025

దేవరకద్ర: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలానికి చెందిన నీలి నాగన్న కూతురు దండు మంగమ్మ మంగళవారం కూలీ పనులకు వెళుతుండగా కారు ఢీ కొనగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 13, 2025

MBNR : హోలీ పండుగ.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

image

మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఎస్పీ జానకి కీలక సూచనలు చేశారు. 14వ తేదీ ఉదయం 6 -12 మధ్యాహ్నం గంటల వరకు హోలీ పండుగను జరుపుకోవాలన్నారు. బలవంతంగా రంగులు పూయడం, హోలీ పండుగ ఇష్టపడని వ్యక్తులపై, వాహనాలపై రంగు నీరు చల్లడం నిషేధమన్నారు. పబ్లిక్ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు చేయడం వీధులలో ఇష్టానుసారంగా తిరగడం అనుమతి లేదన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా ఉంటుందన్నారు.

News March 13, 2025

MBNR: ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు జిల్లా వ్యాప్తంగా మ్యాథ్స్ ,బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించారు. నేడు మొత్తంగా 10,640 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా కేవలం 10,380 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 209 మంది జనరల్,51 మంది ఒకేషనల్ విద్యార్థులు మొత్తంగా 260మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.

error: Content is protected !!