News March 12, 2025
గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.
Similar News
News November 17, 2025
ములుగు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోవిందరావుపేట మండలంలోని పలు కిరాణా, హోటల్లు, ఇతర షాపుల్లో తనిఖీలు చేపట్టి, వ్యాపారస్థులకు పలు సూచనలు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ మాట్లాడుతూ.. వ్యాపార సముదాయాల్లో, హోటళ్లలో గడువు దాటిన, కల్తీ వస్తువులు అమ్మొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 17, 2025
ములుగు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోవిందరావుపేట మండలంలోని పలు కిరాణా, హోటల్లు, ఇతర షాపుల్లో తనిఖీలు చేపట్టి, వ్యాపారస్థులకు పలు సూచనలు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ మాట్లాడుతూ.. వ్యాపార సముదాయాల్లో, హోటళ్లలో గడువు దాటిన, కల్తీ వస్తువులు అమ్మొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 17, 2025
VJA: రూ.15వేల పెన్షన్కు అర్హులైనతే సర్టిఫికెట్ పొందవచ్చు

పెరాలసిస్, మస్క్యులర్ డిస్ట్రోఫీ, తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్థులు, గుండె మార్పిడి వంటి తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న ఎన్టీఆర్ జిల్లా వాసులు రూ. 15వేల పెన్షన్ పొందడానికి ప్రతి మంగళవారం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వేంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు వచ్చి స్పెషలిస్టుల పరీక్షల అనంతరం సర్టిఫికెట్లు పొందాలని సూచించారు.


