News April 22, 2025
గద్వాల: క్విజ్ పోటీల్లో ఉత్తనూర్ విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్

గద్వాల బాల భవన్లో సోమవారం రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి క్విజ్ పోటీలు జరిగాయి. సైన్స్ విభాగంలో జరిగిన పోటీల్లో అయిజ మండలం ఉత్తనూర్ జడ్పీహెచ్ఎస్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అమరేశ్ మొదటి బహుమతి కైవసం చేసుకున్నాడు. డీఈవో అబ్దుల్ గని, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎస్తేరు రాణి, సైన్స్ ఆఫీసర్ పాపన్న చేతుల మీదుగా బహుమతి అందజేశారు. ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 22, 2025
ఖమ్మం జిల్లా ఇంటర్ రిజల్ట్స్

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 16919 మంది పరీక్షలు రాయగా 12996 మంది పాసయ్యారు. 76.81 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో 17837 మందికి 12476 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజీ 69.94 శాతం.
News April 22, 2025
INTER RESULT: ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్లో 9,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయంగా 4,967 మంది పాసయ్యారు. 54.55% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్లో 8,890 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 6,291 మంది పాసయ్యారు. 70.76% ఉతీర్ణత సాధించారు.
News April 22, 2025
ఇంటర్ రిజల్ట్స్: నల్గొండ పాస్ పర్సంటేజ్ ఇలా..

నల్గొండ జిల్లాలో ఫస్టియర్ పరీక్షను 13,977 మంది రాయగా 7931 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 56.74 శాతంగా ఉంది. సెకండియర్లో 12,992 విద్యార్థులకు గాను 8,960 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజ్ 68.97శాతంగా ఉంది.