News March 24, 2025

గద్వాల: గడువు కాలం మరో మూడు నెలలు పెంపు

image

తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ గడువు రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పెంచింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి నూతన అక్రిడేషన్ జారీ చేయకుండా గత ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ గడువు కాలాన్ని పెంచుతుంది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 14, 2025

కరీంనగర్: 6 నెలలుగా జీతాలు ఇవ్వట్లే..!

image

ఉమ్మడి KNR జిల్లాలో పనిచేస్తున్న 11 వేల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా, సమయానికి వేతనం చెల్లించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై CM రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని, జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

News September 14, 2025

మల్టీపర్పస్ పార్క్ లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం

image

KNR ప్రజలకు ఆహ్లాదం కోసం రూ.11 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ పార్క్ ఇప్పుడు వ్యాపార కేంద్రంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఎంట్రీ ఫీజు ₹20కి బదులు ₹50 వసూలు చేస్తున్నారు. అలాగే పిల్లల ఆటలకు, ఫుట్‌పాత్‌పై పార్కింగ్ పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పార్క్‌ను కమర్షియల్ పార్క్‌గా మార్చారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

News September 14, 2025

IOCLలో 523 అప్రెంటిస్‌లు

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(<>IOCL<<>>) 523 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసినవారు అక్టోబర్ 11వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.