News February 2, 2025

గద్వాల: గురుకుల ప్రవేశాలకు మరో అవకాశం

image

గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గద్వాల జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియగా మరో 6 రోజులు పొడిగించారు. వరుస సెలవులు రావడం, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News December 7, 2025

ఫేక్ బ్యాంకు గ్యారంటీలు… రిలయన్స్‌పై ఛార్జిషీట్

image

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, మరో 10 కంపెనీలపై ED ఛార్జిషీట్ దాఖలు చేసింది. ₹68కోట్ల ఫేక్ బ్యాంకు గ్యారంటీలు జారీచేసి మనీల్యాండరింగ్‌కు పాల్పడిన కేసులో ఈడీ చర్యలు వేగవంతం చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ ఇతరులు ₹17000 కోట్లమేర బ్యాంకులను మోసగించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా ₹1120CR ఆస్తుల్ని కూడా ED అటాచ్ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు ₹10117 CR ఆస్తులు అటాచ్ అయ్యాయి.

News December 7, 2025

గురుస్వాముల పాత్ర ఏంటో తెలుసా?

image

గురుస్వామి త్రికరణశుద్ధితో, నిష్కళంక మనస్సుతో ఉంటారు. శాంతి, సత్యం, సమానం వంటి దైవ గుణాలతో మెలుగుతారు. దీక్ష తీసుకున్నప్పటి నుంచి నిగ్రహం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఇతరుల భక్తిని, సేవను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శనం చేస్తారు. అయ్యప్ప సేవలో నిమగ్నమై, ఇతరుల పొరపాట్లను దండించకుండా క్షమిస్తారు. భక్తులకు దీక్షా నియమాలను స్పష్టంగా తెలుపుతూ, అన్ని విధాలా సహాయం చేస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News December 7, 2025

ADB: ఏడాదికోసారి ఎలక్షన్ వస్తే ఎంత బాగుంటుందో..!

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు అభ్యర్థుల నుంచి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇదే అదనుగా భావించి ‘కాస్ట్‌లీ మందు కావాలి’, ‘వారసంతకు వెళ్లాలి’, ‘ఇంట్లో సామాన్ లేదు’ అంటూ అభ్యర్థులను డబ్బుల కోసం అడుగుతున్నారు. ఇక దావతులు, పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు. సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు వస్తే ఇంట్లో దోకా ఉండదని, తమ ఖర్చులన్నీ వసూలు చేసుకోవచ్చని పలువురు బహిరంగంగా చెబుతున్నారు.