News March 30, 2024
గద్వాల: గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మల్లు రవి
లోక్ సభ ఎన్నికల్లో తన గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి పేర్కొన్నారు. గద్వాల కేఎస్ ఫంక్షన్ హాల్లో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు వంత పాడుతూ ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు.
Similar News
News September 30, 2024
అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
దౌల్తాబాద్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివారాలు.. దౌల్తాబాద్ మండలం నుంచి అంత్యక్రియల కోసం వెళ్తుండగా దేవర ఫసల్వాద్ సమీపంలో అదుపు తప్పి ఈర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 30, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలిలా
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా చిన్నతండ్రపాడులో 35.4 డిగ్రీలు, నారాయణపేట జిల్లా గుండుమల్లో 33.2 డిగ్రీలు, వనపర్తి జిల్లా గణపూర్లో 32.7 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పద్రాలో 31.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News September 30, 2024
జూరాల ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ఫ్లో
జూరాలకు ఇన్ ఫ్లో తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి 72 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు వివరించారు. 4 క్రస్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లను కొనసాగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గేట్ల ద్వారా, ఆవిరిరూపంలో, విద్యుదుత్పత్తి నిమిత్తం, కాల్వలకు ఇలా మొత్తంగా 68,647 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.