News March 29, 2025
గద్వాల: చింతరేవులశ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శనివారం గద్వాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.లక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకుడు ఆద్య కృష్ణాచారి ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News October 22, 2025
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలోని వెటర్నరీ & అనిమల్ హస్బెస్టరీ, ఫిషరీష్ డిపార్ట్మెంట్ లలో డేటాఎంట్రీ ఆపరేటర్స్ (3), ఆఫీస్ సబార్డినేట్స్ (38) పోస్టులకు అవుట్సోర్సింగ్ సేవలను అందించటానికి ఎమ్ పానెల్ అయిన ఆసక్తి గల అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News October 22, 2025
కొత్త దర్శకుల విజయం: వినూత్న కథాంశాలే బలం!

వినూత్న కథలతో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో యువ డైరెక్టర్లు సఫలమవుతున్నారు. సూపర్ హీరో జోనర్ ‘హనుమాన్’తో భారీ విజయం పొందారు ప్రశాంత్ వర్మ. HIT 1&2తో క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్తో శైలేష్ కొలను అదరగొట్టారు. అరిషడ్వర్గాలు అనే మైథలాజికల్ అంశంపై సస్పెన్స్ థ్రిల్లర్ ‘అరి’ మూవీతో మెప్పించారు డైరెక్టర్ జయశంకర్. 96, సత్యంసుందరంతో తమిళ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలుగువాళ్లకు దగ్గరయ్యారు.
News October 22, 2025
మీ డబ్బు-మీ హక్కు పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్

మీ డబ్బు-మీ హక్కు అనే నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 నెలల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్లో “మీ డబ్బు-మీ హక్కు” అనే గోడ పత్రికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా పౌరులు తమ పేర్లపై ఉన్న క్లెయిమ్ చేయని లేదా మరచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పించబడుతోందన్నారు.