News March 29, 2025
గద్వాల: చింతరేవులశ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శనివారం గద్వాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.లక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకుడు ఆద్య కృష్ణాచారి ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News November 6, 2025
జీతాల కోసం ఎదురుచూపు: ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన

ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు అందకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం కొన్ని శాఖలకు మాత్రమే చెల్లింపులు జరిగాయని, రెవెన్యూ, దేవాదాయం వంటి కీలక శాఖల అధికారులకు కూడా జీతాలు విడుదల కాలేదని కాకినాడ జిల్లా ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఒకటో తేదీనే ఇస్తామని చెప్పినా కూటమి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో, తాము బ్యాంకు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.
News November 6, 2025
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో 354 పోస్టులు

<
News November 6, 2025
విభిన్న ప్రతిభావంతులకు ఉచిత మూడు చక్రాల మోటార్ సైకిళ్లు

ఏలూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్తో నడిచే మూడు చక్రాల మోటార్ సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నామని ఆ శాఖ జిల్లా మేనేజర్ రామ్ కుమార్ బుధవారం తెలిపారు. అర్హత గల 18 నుంచి 45 ఏళ్ల వారు www.apdascac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తు, ఇతర పత్రాలను నవంబర్ 25లోగా ఏలూరు కార్యాలయంలో అందించాలని ఆయన స్పష్టం చేశారు.


