News March 18, 2025
గద్వాల: చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఈ నెల 15న పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. ధరూర్ మండలం మన్నాపూర్కి చెందిన అబ్రహాం(21) కుటుంబకలహాలు భరించలేక పురుగుమందుతాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 24, 2026
పార్వతీపురం: ఈ నంబర్కు HI అని మెసేజ్ చేస్తే చాలు

వాట్సాప్ మన మిత్ర ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు స్టడీ సెంటర్ ద్వారా పొందవచ్చునని వెల్లడించారు. అందుబాటులో లేనివారు 9532900009 నంబర్కు HI అని మెసేజ్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చుని ఆయన తెలిపారు.
News February 24, 2026
ఘోర ఓటమి.. టీమ్ ఇండియాలో భారీ మార్పులు?

T20WC సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత టీమ్ ఇండియాలో భారీ మార్పులు తప్పవని క్రీడావర్గాలు వెల్లడిస్తున్నాయి. వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ, తిలక్లలో ఒకరిని తప్పించి శాంసన్కు అవకాశం ఇస్తారని పేర్కొంటున్నాయి. అలాగే సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకుంటారని అంచనా వేస్తున్నాయి. బౌలింగ్ విభాగంలోనూ ఛేంజెస్ ఉండొచ్చంటున్నాయి. కాగా భారత్ ఈ నెల 26న జింబాబ్వేతో తలపడనుంది.
News February 24, 2026
మార్చి 2న HYDకు రాహుల్ గాంధీ

తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ సందడి నెలకొంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెల 2న హైదరాబాద్కు రానున్నారు. ప్రధానంగా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో నిర్వహించనున్న కాంగ్రెస్ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో (DCC) రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఎన్నికలు, పార్టీ బలోపేతంపై సూచించనున్నారు.


