News March 18, 2025

గద్వాల: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

ఈ నెల 15న పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. ధరూర్ మండలం మన్నాపూర్‌కి చెందిన అబ్రహాం(21) కుటుంబకలహాలు భరించలేక పురుగుమందుతాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News December 6, 2025

KMR: బుజ్జగింపు పర్వం సక్సెస్ అయ్యేనా?

image

KMR జిల్లాలో 2వ విడత నామినేషన్ల ఉపసంహరణకు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలకు సొంత పార్టీ రెబల్స్, స్వతంత్ర అభ్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉంది. వారిని బుజ్జగించి పోటీ నుంచి తప్పించేందుకు బడా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఈ రణరంగంలో ఉండేదేవరు? ఊడేదెవరు అన్నది పలు చోట్ల ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెబల్స్ బెట్టు వీడతారా? లేక ఇండిపెండెంట్‌గా సై అంటారా? ఇవాళ సాయంత్రం వరకు ఈ ఉత్కంఠ తప్పదు!

News December 6, 2025

నితీశ్‌ కొడుకు రాజకీయాల్లోకి రావొచ్చు: JDU నేత

image

బిహార్‌ CM నితీశ్‌కుమార్‌ తనయుడు నిశాంత్‌ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. JDU జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. “పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. నిర్ణయం మాత్రం ఆయనదే” అని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో నిశాంత్ పోటీ చేయకపోయినా కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

News December 6, 2025

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

AP: తూర్పుగోదావరి జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కేస్ వర్కర్, MTS, సోషల్ వర్కర్, ఎడ్యుకేటర్, కుక్, సైకో-సోషల్ కౌన్సెలర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , LLB, B.Sc. B.Ed, టెన్త్, ఏడో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: eastgodavari.ap.gov.in