News March 29, 2025
గద్వాల: జమ్ములమ్మ ఆలయ ఆదాయం రూ. 27,78,778

గద్వాల మండల పరిధిలోని జమ్మిచెడు జమ్మలమ్మ ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి పురేందర్ కుమార్ మాట్లాడుతూ.. ఆలయ సిబ్బంది సమక్షంలో లెక్కింపు కార్యక్రమంలో చేశామని అన్నారు. ఆలయంలో 65 రోజులకు గాను మొత్తం రూ. 27,78,778/- ఆదాయము వచ్చిందన్నారు. నోట్ల ద్వారా రూ.25,45,700/- ఆదాయం రాగా, నాణేల రూపంలో రూ.2,33,078/- ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News December 7, 2025
గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్ మిక్స్డ్ రేషన్)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.
News December 7, 2025
ADB: చెక్ పవర్ ఉంటే చాలు ఇంకేమీ వద్దు..!

పదవిపై ఆశ మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది. పంచాయతీల్లో సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్ కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. రిజర్వేషన్ అనుకూలించక సర్పంచ్ స్థానం రానివారు వార్డు మెంబర్గా పోటీ చేసే ఉపసర్పంచ్ అవుదామనుకుంటున్నారు. ఇప్పటికే నామినేషన్ల సమర్పణ పూర్తికాగా.. వార్డు మెంబర్లుగా బరిలో ఉన్న వారికి కానుకలిస్తూ తనను ఉప సర్పంచ్గా బలపరచాలని కోరుతున్నారు. చెక్ పవర్ కోసం పాకులాడుతున్నారు.
News December 7, 2025
ఏడుకొండల వాడికి పుష్ప కైంకర్యం చేసిన భక్తుడు

శ్రీవారికి పుష్ప కైంకర్యం చేసిన గొప్ప భక్తుడు అనంతాళ్వార్. ఈయన రామానుజాచార్యుల శిష్యుడు. గురువు ఆదేశం మేరకు తిరుమలలో స్వామివారి సేవకు పూల తోటను పెంచారు. ఓసారి స్వామివారు పిల్లవాడి రూపంలో వచ్చి ఆయనను పరీక్షించగా కోపంతో గునపం విసిరారు. అది తగిలి స్వామివారి చుబుకానికి గాయమైంది. అందుకే శ్రీవారి గడ్డంపై కర్పూరపు చుక్క పెట్టడం ఇప్పటికీ ఆనవాయితీగా ఉంది. ఆ గునపాన్ని తిరుమలతో చూడవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>


