News March 29, 2025

గద్వాల: జమ్ములమ్మ ఆలయ ఆదాయం రూ. 27,78,778

image

గద్వాల మండల పరిధిలోని జమ్మిచెడు జమ్మలమ్మ ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి పురేందర్ కుమార్ మాట్లాడుతూ.. ఆలయ సిబ్బంది సమక్షంలో లెక్కింపు కార్యక్రమంలో చేశామని అన్నారు. ఆలయంలో 65 రోజులకు గాను మొత్తం రూ. 27,78,778/- ఆదాయము వచ్చిందన్నారు. నోట్ల ద్వారా రూ.25,45,700/- ఆదాయం రాగా, నాణేల రూపంలో రూ.2,33,078/- ఆదాయం వచ్చిందన్నారు.

Similar News

News November 1, 2025

హనుమకొండ: ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్‌

image

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నవంబర్‌ 15న హనుమకొండ, పరకాల కోర్టుల్లో స్పెషల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నారు. రాజీపడదగు క్రిమినల్‌, సివిల్‌, ఎం.వి.ఏ., వివాహ, కుటుంబ, బ్యాంకు రికవరీ, ఎన్‌ఐ యాక్ట్‌ కేసులు పరిష్కరించనున్నారు. కక్షిదారులు తమ న్యాయవాదులతో హాజరై రాజీ కుదుర్చుకోవాలని అధికారులు సూచించారు.

News November 1, 2025

ఢిల్లీలో నేటి నుంచి ఈ వాహనాలపై బ్యాన్

image

ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించిన నేపథ్యంలో నగరంలో రిజిస్టర్ కాని, BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని కమర్షియల్ వెహికల్స్‌పై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ నిషేదం విధించింది. నేటి నుంచి వాటికి నగరంలోకి అనుమతి ఉండదు. దీని నుంచి BS-IV వాణిజ్య వాహనాలకు 2026, OCT 31 వరకు మినహాయించింది. ఢిల్లీ రిజిస్టర్డ్ కమర్షియల్ గూడ్స్ వెహికల్స్, BS-VI, CNG/LNG, ఎలక్ట్రికల్ కమర్షియల్ వాహనాలకు అనుమతి ఉంటుంది.

News November 1, 2025

బస్సు దగ్ధంపై తప్పుడు ప్రచారం: 27 మందిపై కేసు

image

కర్నూలు శివారులో జరిగిన బస్సు దగ్ధ ఘటనపై తప్పుడు సమాచారం వైరల్ చేసిన 27 మందిపై కర్నూలు తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర SM వేదికల్లో వాస్తవాలకు విరుద్ధంగా పోస్టులు చేస్తూ, తప్పుడు కోటేషన్లు పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. ప్రజల్లో భయం, గందరగోళం సృష్టించేలా ప్రచారం జరిపినందుకు గానూ ఆ యూజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.