News March 20, 2025

గద్వాల: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. హైవేపై ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో కారు డ్రైవర్ ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉండవెల్లి ఎస్ఐ మహేశ్ ఘటనా స్థలానికి పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 29, 2025

వినుకొండలో బుల్లెట్ బైకు చోరీ

image

వినుకొండలో దావూద్ హోటల్ ముందు నిలిపిన (AP 39QQ 1408) రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ 650 సీసీ చోరీకి గురైంది. గుర్తు తెలియని యువకుడు హోటల్‌కు వచ్చి టిఫిన్ చేసి కౌంటర్ వద్దకు వచ్చి తనది విజయవాడ అని పరిచయం చేసుకున్నాడు. తనకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టమని, ఓ సారి ట్రైల్ చూస్తానని చెప్పి తీసుకెళ్లినట్లు బాధితుడు రబ్బాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News April 29, 2025

RTCని కనుమరుగు చేసిన కేసీఆర్: జగ్గారెడ్డి

image

RTCని కేసీఆర్ కనుమరుగు చేశారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉచిత బస్సుకు కేసీఆర్ విమర్శిస్తున్నారంటే ఉచిత బస్సు సక్సెస్ అయినట్లేనని తెలిపారు. దీంతో కేసీఆర్‌కు నష్టం కలుగుతుంది కాబట్టే వెస్ట్ అంటున్నారని పేర్కొన్నారు. RTCకి దానికి ప్రాణం పోసిన ఘనత రాహుల్ గాంధీ, అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.

News April 29, 2025

భద్రకాళి ఆలయంలో కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన

image

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైన బాధితులు ఎవరిని సంప్రదించాలి, 1930 నంబర్‌కు ఎలా ఫిర్యాదు చేయాలి, మత్తు పదార్థాల వినియోగం, విక్రయం ద్వారా కలిగే నష్టాలను ఎస్ఐ పోచాలు స్థానిక భద్రకాళి దేవాలయంలోని భక్తులకు వివరించారు.

error: Content is protected !!