News March 13, 2025
గద్వాల జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..!

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దిమ్మతిరిగేలా 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులను ఉపయోగించాలని ప్రభుత్వ అధికారులు ప్రజలకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం మల్దకల్ లో అత్యధికంగా 39.7°c నమోదవ్వగా.. గద్వాల్ లో 38.9°c, ధరూర్లో 38.3°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News October 19, 2025
కరీంనగర్: SU డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో BA, B.com, Bsc, BBA కోర్సుల్లో 1వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా OCT 27 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో OCT 29 వరకు చెల్లించుకోవచ్చని SU పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు. పరీక్షలు NOV 13 నుంచి నిర్వహించనున్నారు.
News October 19, 2025
చిత్తూరు తాలూకా SI సస్పెండ్

చిత్తూరు తాలూకా ఎస్ఐ మల్లికార్జున సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు SP తుషార్ డూడీ ఆదేశాలు జారీ చేశారు. మల్లికార్జునపై పలు ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఓ బాధితుడు SI ఆడియో రికార్డును కలెక్టర్, ఎస్పీకి పంపినట్లు తెలుస్తోంది. ఘటనపై విచారణ జరిపిన ఎస్పీ చర్యలు తీసుకున్నారు.
News October 19, 2025
ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో పొన్నూరు ఎమ్మెల్యే భేటీ

సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నాయుడుపేట పట్టణంలోని ఆమె నివాసంలో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే, సంగం మిల్క్ డైరీ చైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సంగం డైరీ మేనకూరు సెజ్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు అవుతుండగా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలపై ఇరువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. సంగం డైరీ రైతులకు, పాల ఉత్పత్తిదారులకు ఆశాకిరణమని ధూళిపాల నరేంద్ర తెలిపారు.