News March 13, 2025

గద్వాల జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..!

image

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దిమ్మతిరిగేలా 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులను ఉపయోగించాలని ప్రభుత్వ అధికారులు ప్రజలకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం మల్దకల్ లో అత్యధికంగా 39.7°c నమోదవ్వగా.. గద్వాల్ లో 38.9°c, ధరూర్‌లో 38.3°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 24, 2025

నరదృష్టిని తొలగించే స్తోత్రం

image

కాళికే పాపహరిణి దృష్టిదోష వినాశిని ।
శత్రు సంహారిణి మాతా రక్ష రక్ష నమోస్తుతే ॥
మనపై, మన ఇల్లు, వ్యాపారం వంటి వాటిపై ఇతరుల చెడు దృష్టి పడినప్పుడు, ఆ దృష్టి దోషాల నివారణ కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తారు. శత్రు భయం, నెగటివ్ ఆలోచనల నుంచి ఇది మనల్ని విముక్తుల్ని చేస్తుంది. రోజూ పఠిస్తే.. ఆటంకాలు తొలగిపోయి, అమ్మవారి రక్షణ ఎప్పుడూ ఉంటుందని, జీవితం సుఖశాంతులతో సాగుతుందని పండితులు చెబుతున్నారు.

News November 24, 2025

నేడు కొత్త CJI ప్రమాణ స్వీకారం.. తొలిసారి విదేశీ అతిథుల రాక

image

53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(CJI)గా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్ భవన్‌లో రాష్ట్రపతి ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, SL, నేపాల్ దేశాల చీఫ్ జస్టిస్‌లు హాజరుకానున్నారు. CJI ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులు రావడం ఇదే తొలిసారి. కాగా CJIగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వ్యక్తిగా సూర్యకాంత్ నిలవనున్నారు.

News November 24, 2025

AP TET.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

image

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2.59 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ సర్వీస్ టీచర్లు 32,000 మంది దరఖాస్తు చేశారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఆన్‌లైన్‌లో రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.