News March 13, 2025

గద్వాల జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..!

image

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దిమ్మతిరిగేలా 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులను ఉపయోగించాలని ప్రభుత్వ అధికారులు ప్రజలకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం మల్దకల్ లో అత్యధికంగా 39.7°c నమోదవ్వగా.. గద్వాల్ లో 38.9°c, ధరూర్‌లో 38.3°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 26, 2025

జగిత్యాలలో మొత్తం ఓటర్లు 6,07,263 లక్షల మంది

image

జగిత్యాల జిల్లాలో మొత్తం 6,07,263 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఇందులో 2,89,702 మంది పురుషులు, 3,17,552 మంది మహిళలు, 9 మంది ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషమన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.

News November 26, 2025

జగిత్యాలలో శాంతియుత ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 7 మండలాల్లో 122 పంచాయతీలకు, రెండవ విడతలో 144, మూడవ విడతలో 119 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

News November 26, 2025

జగిత్యాల: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజ గౌడ్ (లోకల్ బాడీస్) తదితరులు పాల్గొన్నారు.