News March 13, 2025
గద్వాల జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..!

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దిమ్మతిరిగేలా 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులను ఉపయోగించాలని ప్రభుత్వ అధికారులు ప్రజలకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం మల్దకల్ లో అత్యధికంగా 39.7°c నమోదవ్వగా.. గద్వాల్ లో 38.9°c, ధరూర్లో 38.3°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News December 7, 2025
SKLM: నేడు ఎన్ఎంఎంఎన్ ఎగ్జామ్..పరీక్షా కేంద్రాలివే

విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయ ప్రతిభా ఉపకార వేతనం(ఎన్ఎంఎంఎన్) ద్వారా స్కాలర్షిప్ను అందిస్తుంది. దీని కోసం NMMN ఎగ్జామ్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 8వతరగతి విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు కాగా..ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి నెల రూ.1000లను ఇస్తూ ఏడాదికి రూ.12వేలను అందిస్తుంది. నేడు పలాస, టెక్కలి, శ్రీకాకుళంలో ఉదయం 10-1 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది.
News December 7, 2025
నల్గొండ: యాసంగికి నీటి విడుదల ఇలా..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్కు ఆన్, ఆఫ్ పద్ధతిలో సాగు నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 80.74 టీఎంసీల విడుదల చేయనుండగా నల్గొండ చీఫ్ ఇంజినీర్ పరిధిలో 43.74 టీఎంసీలు, సూర్యాపేట ఇంజినీర్ పరిధిలో 40 టీఎంసీల అవసరం ఉంటుందని నిర్ధారించారు. 15 రోజులకోసారి ఆన్, ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల చేయనున్నారు. NLGలో 4,41,118, SRPTలో 4,74,041 ఎకరాలకు నీరు ఇవ్వనున్నారు.
News December 7, 2025
WGL: పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యేలకు పరీక్షే!

పంచాయతీ ఎన్నికలు MLAలకు పెద్ద పరీక్షలా మారింది. సరిగ్గా రెండేళ్ల అనంతరం జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజల మనోగతం ఈ ఎన్నికల ద్వారా వెల్లడి కానుంది. ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ పార్టీ MLAలు గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ 11, ఒక్క స్థానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. పంచాయతీలను క్లీన్ స్వీప్ చేసి తమ సత్తా చాటుకొవాలని ఎమ్మెల్యేలందరూ గ్రామాల్లో తిరుగుతున్నారు.


