News March 5, 2025

గద్వాల జిల్లాలో భానుడి భగభగలు

image

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. మంగళవారం గరిష్ఠంగా అలంపూర్, ద్యాగదొడ్డి, రాజోలి, మల్దకల్‌లో 38.9°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక గద్వాల్‌లో 38.6, చిన్న తాండ్రపాడు, సాతర్ల, ధరూర్ లో 38.5°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News January 6, 2026

కరప: తల్లి మందలించిందని మనస్తాపం.. బాలుడి ఆత్మహత్య

image

తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పలంక మొండి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సునీత తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో నివసించే సంగాని సూరిబాబు ఫ్యామిలీతో ఇటీవలే గ్రామానికి వచ్చాడు. తిరిగి హైదరాబాద్‌ వెళ్తుండగా తనను మందలించిందని మనస్తాపానికి గురైన కుమారుడు సింహాద్రి(16) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.

News January 6, 2026

KNR: AIFB పార్టీ వైపు ఆశావహుల చూపు

image

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, BJP, BRS పార్టీలలో కాంపిటీషన్ ఉండటంతో ఆశావహులు AIFB పార్టీ టికెట్ పై పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆపార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి AIFBలో సభ్యత్వం ఉన్న వారికే టికెట్లు ఇస్తామని చెప్పారు. ఉమ్మడి KNRలో AIFB నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం MLAగా కోరుకంటి చందర్ గెలవగా, గత మున్సిపల్ ఎన్నికల్లో RGMలో 11, KNRలో 3 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది.

News January 6, 2026

కుంకుమ పువ్వు, కూరగాయలతో ఏటా రూ.24 లక్షల ఆదాయం

image

అధునాతన వ్యవసాయ పద్ధతుల్లో హై క్వాలిటీ కశ్మీరీ కుంకుమ పువ్వును సాగు చేస్తూ రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు ఒడిశాకు చెందిన సుజాతా అగర్వాల్. తన ఇంట్లోనే 100 చ.అడుగుల గదిలో మూడేళ్లుగా ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వును, హైడ్రోపోనిక్స్ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్ సాగు చేసి విక్రయిస్తూ ఏటా రూ.24 లక్షల ఆదాయం పొందుతున్నారు. సుజాతా సక్సెస్ స్టోరీ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.