News March 25, 2025

గద్వాల జిల్లాలో భానుడి భగభగలు..!

image

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దిమ్మతిరిగేలా 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులను ఉపయోగించాలని ప్రభుత్వ అధికారులు ప్రజలకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం మల్దకల్‌లో అత్యధికంగా 39.7°c నమోదవగా.. వెంకటాపూర్, కొలూర్ తిమ్మనదొడ్డిలో 38.6°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 18, 2025

రికార్డు స్థాయిలో పసిడి దిగుమతులు

image

ధరలు పెరుగుతున్నా పసిడికి గిరాకీ తగ్గడంలేదు. రికార్డు స్థాయిలో దిగుమతులు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో 14.72 బిలియన్ డాలర్ల బంగారం ఇంపోర్ట్ అయింది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే దాదాపు 3 రెట్లు($4.92Bn) అధికం కావడం గమనార్హం. ఏప్రిల్-అక్టోబర్ మధ్య $41.23Bn దిగుమతులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 21.44%($34Bn) ఎక్కువ. స్విట్జర్లాండ్ నుంచి 40%, UAE నుంచి 16%, సౌతాఫ్రికా నుంచి 10% గోల్డ్ వస్తోంది.

News November 18, 2025

రికార్డు స్థాయిలో పసిడి దిగుమతులు

image

ధరలు పెరుగుతున్నా పసిడికి గిరాకీ తగ్గడంలేదు. రికార్డు స్థాయిలో దిగుమతులు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో 14.72 బిలియన్ డాలర్ల బంగారం ఇంపోర్ట్ అయింది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే దాదాపు 3 రెట్లు($4.92Bn) అధికం కావడం గమనార్హం. ఏప్రిల్-అక్టోబర్ మధ్య $41.23Bn దిగుమతులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 21.44%($34Bn) ఎక్కువ. స్విట్జర్లాండ్ నుంచి 40%, UAE నుంచి 16%, సౌతాఫ్రికా నుంచి 10% గోల్డ్ వస్తోంది.

News November 18, 2025

ADB: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈఓ

image

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిల్ విద్యార్థుల పరీక్ష రుసుమును చెల్లించేందుకు తేదీలను పొడిగిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఇంటర్ గేషన్ సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు. పరీక్ష రుసుముల వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన సూచించారు.