News March 5, 2025
గద్వాల జిల్లాలో భానుడి భగభగలు

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. మంగళవారం గరిష్ఠంగా అలంపూర్, ద్యాగదొడ్డి, రాజోలి, మల్దకల్లో 38.9°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక గద్వాల్లో 38.6, చిన్న తాండ్రపాడు, సాతర్ల, ధరూర్ లో 38.5°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 21, 2025
మహబూబ్నగర్: ప్రశాంతంగా పదో తరగతి మొదటి రోజు పరీక్ష

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లను రూమ్ నెంబర్ వైస్గా చెక్ చేసుకుని వెళ్లారు. పరీక్ష కేంద్రంలో 144 సెక్షన్ విధించారు. పరీక్ష రాసే విద్యార్థులకు అధికారులు మంచినీటి వసతితో పాటు అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. మొదటి రోజు ప్రశాంతంగా పరీక్ష ముగిసింది.
News March 21, 2025
ఆదిలాబాద్ డైట్ కళాశాలలో ఉద్యోగాలు

ఆదిలాబాద్లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా, ఫోటోలతో ఈ నెల 22 నుంచి 24 లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులను నమూనా తరగతుల ఆధారంగా ఎంపిక చేస్తామని వెల్లడించారు.
News March 21, 2025
పీయూ: ఆ సర్క్యూలర్ను వాపస్ తీసుకోవాలని SFI నిరసన

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధిస్తూ వీసీ విడుదల చేసిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని, HCUలో 400 ఎకరాల భూములను వేలం వేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని SFI PU అధ్యక్షుడు బత్తిని రాము పాలమూరు యూనివర్సిటీ PG కాలేజ్ ముందు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు రాజేశ్, శ్రీనివాస్, విద్యుల్లత, ఈదన్న, సాయి, శిరీష, రాంచరణ్ పాల్గొన్నారు.