News March 10, 2025
గద్వాల జిల్లాలో భానుని భగభగలు

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. రానున్న రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం మల్దకల్ మండల కేంద్రంలో అత్యధికంగా 40.2°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అలంపూర్ లో 39.9°c, సాతర్లలో 39.3°c, ధరూర్ లో 38.6°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News October 20, 2025
దర్శకుడిగా మారిన హీరో.. గుర్తుపట్టలేని విధంగా లుక్!

విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘మకుటం’ మూవీ నుంచి దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఇందులో విశాల్ సూట్ ధరించి తెల్లగడ్డం, కళ్లద్దాలతో గుర్తుపట్టలేని లుక్లో ఉన్నారు. ఈ మూవీతో తాను దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నానని, పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశాల్ తెలిపారు. దుషార విజయన్, అంజలి తదితరులు నటిస్తున్న ఈ మూవీని RB చౌదరి నిర్మిస్తుండగా, GV ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
News October 20, 2025
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో బెల్లంపల్లి ఎమ్మెల్యే సమావేశం

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బెంగుళూరులోని ఆయన నివాసంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రానున్న స్థానిక ఎన్నికలు, గ్రామ స్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన పార్టీ బలోపేతం దిశగా సూచనలు అందించారు.
News October 20, 2025
రియాజ్ ఎన్కౌంటర్పై కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబం హర్షం

TG: రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందడంపై కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత ఆనందం వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు. రియాజ్ <<18056853>>కత్తితో దాడి<<>> చేయడంతో కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయిన విషయం తెలిసిందే.