News April 2, 2024

గద్వాల జిల్లాలో రూ.11,54,200 సీజ్

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో గద్వాల జిల్లాలోని బార్డర్ చెక్ పోస్టుల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.11,54,200 పట్టుబడినట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు. వాటికి సంబంధించి అనుమతి పత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రూ.11 లక్షలు, కేటీ దొడ్డి మండలం నందిన్నె బార్డర్ చెక్ పోస్ట్ వద్ద రూ.54,200 సీజ్ చేశామని నగదును గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు.

Similar News

News November 22, 2025

MBNR: 24 గంటలు సిద్ధంగా ఉన్నాం.. ఫోన్ చేయండి: ఎస్పీ

image

బాలికలు, మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. బస్‌స్టాండ్‌లు లేదా బహిరంగ ప్రదేశాల్లో అసురక్షితంగా అనిపిస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు లేదా షీ టీమ్ నంబర్ 8712659365కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలు సిద్ధంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు.

News November 22, 2025

MBNR: 24 గంటలు సిద్ధంగా ఉన్నాం.. ఫోన్ చేయండి: ఎస్పీ

image

బాలికలు, మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. బస్‌స్టాండ్‌లు లేదా బహిరంగ ప్రదేశాల్లో అసురక్షితంగా అనిపిస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు లేదా షీ టీమ్ నంబర్ 8712659365కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలు సిద్ధంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు.

News November 21, 2025

MBNR: ప్రయాణికురాలిగా బస్టాండ్‌లో ఎస్పీ పరిశీలన

image

మహబూబ్ నగర్ జిల్లాలోని ‘ప్రజా భద్రత–పోలీసు బాధ్యత కార్యక్రమం’ కొనసాగుతున్న సందర్భంలో జిల్లా ఎస్పీ డి.జానకి శుక్రవారం మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సాధారణ మహిళలా నడుచుకుంటూ ప్రత్యక్ష పరిశీలనలు నిర్వహించింది. బస్టాండ్‌లో వేచి ఉన్న బాలికలతో, మహిళలతో వ్యక్తిగతంగా మాట్లాడి, ఎవరి నుండైనా వేధింపులు, అసౌకర్యాలు, అనుమానాస్పద ప్రవర్తన వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలన్నారు.