News March 26, 2025
గద్వాల జిల్లా ఆదర్శం..!

జోగులాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో వివిధ రకాల విధులు నిర్వహిస్తారు. పారిశుద్ధ్య చర్యలు, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత తదితర పనులతో ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతున్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో ప్రజలు ఆర్థికంగా, ఆత్మగౌరవంతో మరింత బలోపేతమయ్యారు.
Similar News
News April 25, 2025
HYD: సెలవుల్లో జూపార్క్ చుట్టేద్దాం..!

వేసవి సెలవుల్లో జూపార్క్ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. మే నెలలో జూ టూర్ పేరుతో చిన్నారులకు జూ మొత్తం చూపించనున్నారు. స్నాక్స్, భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక ప్రత్యేకంగా రూపొందించిన కిట్ (క్యాప్, నోట్బుక్, బ్యాడ్జ్) ఇస్తారు. రూ.1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే ఈ అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. 9281007836కు వాట్సప్లో సంప్రదించవచ్చు.
News April 25, 2025
VJA: కోరమండల్ ఎక్స్ప్రెస్లో మంటలు

హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్ప్రెస్లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు. అనంతరం ట్రైన్ విజయవాడ వైపు కదిలింది.
News April 25, 2025
IPL: ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?

IPL 2025లో సాధారణంగా ఏవైనా జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచులు(16 పాయింట్లు) గెలవాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రకారం ఆయా జట్లు కింది సంఖ్యలో మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.
* గుజరాత్ టైటాన్స్(GT)- 2, DC- 2, RCB-2,
* PBKS-3, LSG-3, MI-3
* KKR-5, SRH-6, CSK-6
* RR-అవకాశాలు లేనట్లే.