News April 4, 2025

గద్వాల జిల్లా కలెక్టర్ ముఖ్య గమనిక

image

LRS స్కీం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల కోసం ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేట్ ఈనెల 30 వరకు అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ.ఎం.సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ GO No 182ను జారీ చేశారని పేర్కొన్నారు.

Similar News

News April 18, 2025

మొక్కల ఆధారిత ప్రొటీన్లతో ఎక్కువ ఆయుర్దాయం

image

శరీరానికి విటమిన్లతో పాటు ప్రొటీన్లు చాలా అవసరం. వాటి కోసం మాంసాన్ని ఆశ్రయిస్తుంటాం. అయితే మొక్కల ఆధారిత(శనగలు, బఠానీలు, టోఫు) ప్రొటీన్లు తీసుకునే దేశాల్లో వయోజన ఆయుర్దాయం ఎక్కువని సిడ్నీ వర్సిటీ అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక వ్యాధులు, అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని వెల్లడైంది. 1961-2018 మధ్య 101 దేశాల్లో ఆహార సరఫరా, జనాభా డేటా ఆధారంగా సైంటిస్టులు ఈ అధ్యయనం చేశారు.

News April 18, 2025

శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: డీసీపీ

image

శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సూచించారు. నర్సంపేటలోని బస్టాండ్ ఆవరణలో స్పెషల్ ట్రైన్డ్ నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రవాణా నియంత్రణకు ఈ తనిఖీలు చేపట్టినట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఏసీపి కిరణ్ కుమార్, సిఐ రమణమూర్తి, ఎస్సైలు రవికుమార్, అరుణ్ తదితరులు ఉన్నారు.

News April 18, 2025

త్వరలో EPFO 3.0.. సేవలు సులభతరం: మాండవీయ

image

ఈపీఎఫ్‌వో చందాదారులకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. సేవలను సులభతరం చేసేందుకు అత్యాధునిక ఫీచర్లతో మే/జూన్‌కు EPFO 3.0ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆటో క్లెయిమ్, డిజిటల్ కరెక్షన్స్, ATM ద్వారా నగదు విత్‌డ్రా వంటి సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. క్లెయిమ్‌లు, కరెక్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, ఫారాలు నింపడం వంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

error: Content is protected !!