News April 4, 2025

గద్వాల జిల్లా కలెక్టర్ ముఖ్య గమనిక

image

LRS స్కీం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల కోసం ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేట్ ఈనెల 30 వరకు అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ.ఎం.సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ GO No 182ను జారీ చేశారని పేర్కొన్నారు.

Similar News

News October 16, 2025

నేడు ఈశాన్య రుతుపవనాల ఆగమనం

image

ఇవాళ దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. ఇదే రోజు నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు APలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA పేర్కొంది. ఈ నెల 20కల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD అంచనా వేసింది. అది వాయుగుండం లేదా తుఫానుగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.

News October 16, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రావద్దు: మంత్రి వాకిటి

image

ఇంటిలో నిర్మాణాలలో లబ్ధిదారులకు ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావద్దని మంత్రి డాక్టర్ వాకిట శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు పట్టణంలో ఆయన కల్లుగీత డిపార్ట్మెంట్ రాష్ట్ర ఛైర్మన్ కేశం నాగరాజు గౌడ్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇల్ల నిర్మాణంలో వేగవంతం చేయాలని లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తహశీల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు.

News October 16, 2025

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

image

ఏసీబీ ముమ్మర దాడులు నిర్వహిస్తున్నా కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. బుధవారం అనంతపురంలోని జెడ్పీ పరిషత్ క్యాంపస్‌లో సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ, అటెండర్ నూర్ అక్రమ సంపాదన బాగోతం బట్టబయలైంది. లక్ష్మీనారాయణ రూ.10 వేలు, నూర్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.