News March 19, 2025

గద్వాల జిల్లా ప్రజలకు ఆర్టీసీ శుభవార్త 

image

గద్వాల్ జిల్లా ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ గద్వాల్ డిపో అధికారులు శుభవార్త తెలిపారు. డిపో లాజిస్టిక్స్ సేవల ద్వారా గద్వాల్ జిల్లా ప్రజలు ఇంటికే భద్రాద్రి సీతారాములవారి తలంబ్రాలను పొందవచ్చని కార్గో ఏటీఎం ఇసాక్ తెలిపారు. కార్గో టీమ్‌కు రూ.151 చెల్లించి బుకింగ్ రశీదు పొందాలన్నారు. అనంతరం సీతా రాముల కళ్యాణ తలంబ్రాలను మీ ఇంటి వద్దకు చేర్చుతారని, వివరాలకు పృథ్వీరాజ్ 9154298609 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News December 13, 2025

భూపాలపల్లిలో నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

image

జిల్లాలో మామునూరు, చొప్పదండి నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. భూపాలపల్లి జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో 253 మందికి 181 మంది (హాజరు 72.01), కాటారం జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో 198 మందికి 133 మంది హాజరైనట్లు డీఈఓ ఎం.రాజేందర్ తెలిపారు. మొత్తం 137 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

News December 13, 2025

సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒత్తిడి దూరం

image

సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు ఒత్తిడి దూరమవుతుందని నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. పట్టణంలోని SDR పాఠశాలలో 11వ వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఒకే వేదికపై విభిన్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సీఐ కృష్ణమూర్తి, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

News December 13, 2025

వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

image

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.