News March 19, 2025

గద్వాల జిల్లా ప్రజలకు ఆర్టీసీ శుభవార్త 

image

గద్వాల్ జిల్లా ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ గద్వాల్ డిపో అధికారులు శుభవార్త తెలిపారు. డిపో లాజిస్టిక్స్ సేవల ద్వారా గద్వాల్ జిల్లా ప్రజలు ఇంటికే భద్రాద్రి సీతారాములవారి తలంబ్రాలను పొందవచ్చని కార్గో ఏటీఎం ఇసాక్ తెలిపారు. కార్గో టీమ్‌కు రూ.151 చెల్లించి బుకింగ్ రశీదు పొందాలన్నారు. అనంతరం సీతా రాముల కళ్యాణ తలంబ్రాలను మీ ఇంటి వద్దకు చేర్చుతారని, వివరాలకు పృథ్వీరాజ్ 9154298609 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News December 16, 2025

​విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: సీపీ గౌస్ ఆలం

image

సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం అదే రోజు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. రేపు జరగనున్న మూడో దశ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు తీసిన సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు షేర్ చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 16, 2025

సర్పంచ్ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: సీపీ గౌస్ ఆలం

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి.సైదాపూర్ 5 మండలాల పరిధిలో ​గ్రామ పంచాయతీలు 111 కాగా పోలింగ్ కేంద్రాల 1034 ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, పూర్తిగా నిషేధం అన్నారు.

News December 16, 2025

జనగామ: అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు!

image

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పింకేష్ కుమార్ బాధ్యతలు చేపట్టి మంగళవారంతో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ మేరకు ఆయనకు పలువురు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈయన అదనపు కలెక్టర్ బాధ్యతలతో పాటు విద్యాశాఖ, మున్సిపల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండేళ్లలో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.