News March 19, 2025
గద్వాల జిల్లా ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

గద్వాల్ జిల్లా ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గద్వాల్ డిపో అధికారులు శుభవార్త తెలిపారు. డిపో లాజిస్టిక్స్ సేవల ద్వారా గద్వాల్ జిల్లా ప్రజలు ఇంటికే భద్రాద్రి సీతారాములవారి తలంబ్రాలను పొందవచ్చని కార్గో ఏటీఎం ఇసాక్ తెలిపారు. కార్గో టీమ్కు రూ.151 చెల్లించి బుకింగ్ రశీదు పొందాలన్నారు. అనంతరం సీతా రాముల కళ్యాణ తలంబ్రాలను మీ ఇంటి వద్దకు చేర్చుతారని, వివరాలకు పృథ్వీరాజ్ 9154298609 నంబర్ను సంప్రదించాలన్నారు.
Similar News
News December 10, 2025
కృష్ణా: 1500కి పైగా ప్రమాదాలు.. కారణం అదేనా..?

భారీ లోడుతో, ఫిట్నెస్ లేని వాహనాల కారణంగా ఈ ఏడాది ఉమ్మడి కృష్ణాలో 1500కు పైగా ప్రమాదాలు జరిగాయి. వీటిని తనిఖీ చేసి సీజ్ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి వాహనాలను పట్టిపట్టనట్లు వదలడంతోనే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News December 10, 2025
1,284 మంది బైండోవర్: ఎస్పీ నరసింహ

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 170 సమస్యాత్మక గ్రామాలు గుర్తించామని ఎస్పీ నరసింహ చెప్పారు. గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, పాత నేరస్థులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నవారు 1,284 మందిని ముందస్తుగా బైండోవర్ చేశామన్నారు. 136 కేసుల్లో రూ.9,50,000 విలువైన 1,425 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపాపారు. లైసెన్స్ కలగిన 53 ఆయుధాలను డిపాజిట్ చేయించామన్నారు.
News December 10, 2025
NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.


