News March 19, 2025

గద్వాల జిల్లా బిడ్డ GOVT జాబ్ కొట్టింది..!

image

ఇటీవల విడుదలైన హాస్టల్ వెల్ఫేర్ ఫలితాల్లో గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన సునీత ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా బుధవారం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమలేశ్, నాయకులు నాయుడు, జయన్న, రాజేశ్, ఏసన్నతో కలిసి సునీత ఇంటికి వెళ్లి ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ తాలూకా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు.

Similar News

News March 20, 2025

60ఏళ్లు గడిచినా రైళ్ల వేగంలో మార్పేది?.. నెట్టింట విమర్శలు

image

పొరుగు దేశాలు అక్కడి రైళ్ల వేగాన్ని రెట్టింపు చేస్తే ఇండియా మాత్రం ఇంకా 120-130KMPH వేగం వద్దే ఆగిపోయిందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీనికోసం 1969లో మొదలైన రాజధాని EXPను ఉదహరిస్తున్నారు. ఇది 55ఏళ్ల క్రితమే 120KMPH వేగంతో నడిచే రైలుగా పరిచయమైందంటున్నారు. ఇటీవలే వందేభారత్ రైలు 130KMPHతో అందుబాటులోకి వచ్చిందని, ఆరు దశాబ్దాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?

News March 20, 2025

కండక్టర్‌పై దాడి.. రాజంపేట సీఐ వార్నింగ్

image

ఈనెల 16వ తేదీన నందలూరు బస్టాండ్‌లో కండక్టర్‌పై దాడి విషయంలో ఇరు వర్గాల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజంపేట రూరల్ సీఐ కుళ్లాయప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికురాలితో కండక్టర్ ప్రవర్తించిన తీరుపై ఆమె బంధువులు ఆగ్రహం చెంది దాడి చేశారని, ప్రయాణికులు కండక్టర్‌తో ఆ మహిళకు సారీ చెప్పించడంతో సమస్య అక్కడే పరిష్కారం అయిందన్నారు. కలహాలు సృష్టించే విధంగా ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News March 20, 2025

బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

image

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై 2020లో GHMC ఎన్నికల ప్రచారం వేళ నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. అప్పుడు కార్యకర్తల భేటీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయనపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇవాళ ఆ కేసుపై విచారణ జరగ్గా ఆధారాలు లేవని బండి సంజయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు కొట్టేస్తూ తీర్పునిచ్చింది.

error: Content is protected !!