News February 28, 2025

గద్వాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ సస్పెండ్..!

image

గద్వాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ తిరుపతిరావును సస్పెండ్ చేస్తూ సీఎండి ముషారఫ్ ఫరూకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ధరూర్ మండలం అల్వాలపాడు సబ్ స్టేషన్ వద్ద బుధవారం కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళన చేశారు. జూరాల నుంచి కాలువలకు నీళ్లు వదులుతున్నప్పటికీ కరెంటు కోతలతో సకాలంలో నీరందించక పంటలు ఎండిపోతున్నాయని, ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు తెలిపారు. దీంతో ఎస్‌ఈపై చర్యలు తీసుకున్నారు.

Similar News

News November 18, 2025

సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.

News November 18, 2025

సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.

News November 18, 2025

MLA కౌశిక్‌పై శ్రీశైలం యాదవ్ కామెంట్స్.. BRS ON FIRE

image

HZB MLA పాడి కౌశిక్ రెడ్డిపై జూబ్లీహిల్స్ MLA తండ్రి శ్రీశైలం యాదవ్ చేసిన కామెంట్స్‌పై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఓ MLAపై శ్రీశైలం అలాంటి వ్యాఖ్యలు చేయడం గుండాయిజమేనని BRS నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దని, పోటీచేస్తే ఓడిపోతావని నవీన్‌తో కౌశిక్ అనడంపై ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో శ్రీశైలం యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్‌కు జీవితం ఇచ్చిందే తామని, తను దెబ్బలు తింటే నవీన్ కాపాడాడన్నారు.