News February 28, 2025
గద్వాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ సస్పెండ్..!

గద్వాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ తిరుపతిరావును సస్పెండ్ చేస్తూ సీఎండి ముషారఫ్ ఫరూకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ధరూర్ మండలం అల్వాలపాడు సబ్ స్టేషన్ వద్ద బుధవారం కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళన చేశారు. జూరాల నుంచి కాలువలకు నీళ్లు వదులుతున్నప్పటికీ కరెంటు కోతలతో సకాలంలో నీరందించక పంటలు ఎండిపోతున్నాయని, ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు తెలిపారు. దీంతో ఎస్ఈపై చర్యలు తీసుకున్నారు.
Similar News
News November 17, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 118 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 118 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.
News November 17, 2025
ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన GWMC కమిషనర్

గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరార్థమై ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. GWMCలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 17, 2025
జగిత్యాల: రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ నల్లగుట్ట చౌరస్తా వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. బైక్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో గొల్లపల్లి మండలం శేకల్లకు చెందిన అరుణ్(21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్పై ఉన్న మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.


