News February 28, 2025

గద్వాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ సస్పెండ్..!

image

గద్వాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ తిరుపతిరావును సస్పెండ్ చేస్తూ సీఎండి ముషారఫ్ ఫరూకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ధరూర్ మండలం అల్వాలపాడు సబ్ స్టేషన్ వద్ద బుధవారం కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళన చేశారు. జూరాల నుంచి కాలువలకు నీళ్లు వదులుతున్నప్పటికీ కరెంటు కోతలతో సకాలంలో నీరందించక పంటలు ఎండిపోతున్నాయని, ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు తెలిపారు. దీంతో ఎస్‌ఈపై చర్యలు తీసుకున్నారు.

Similar News

News November 16, 2025

హెల్తీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగ లక్ష్యం: సీఎం

image

AP: సోషల్ మీడియాను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దానిపై నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. హెల్తీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగ లక్ష్యమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో భారత్ అన్ని రంగాల్లో నిపుణులను అందిస్తుందని, 2047 కల్లా ప్రపంచంలోనే ప్రభావవంతమైన దేశంగా మారుతుందని చెప్పారు.

News November 16, 2025

మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన: మంత్రి సీతక్క

image

మేడారంలో మాస్టర్ ప్లాన్ మేరకు జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ తదితరులతో కలిసి ఆదివారం పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వాగు మెట్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా జంపన్న వాగు వంతెనపై జాలి (రక్షణ కంచె) ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

News November 16, 2025

తిరుపతి: విద్యుత్ సమస్యలు ఉంటే కాల్ చేయండి.!

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు CMD శివశంకర్ తెలిపారు. సోమవారం ఉదయం 10-12 మధ్య కార్యక్రమం ఉంటుందన్నారు. రాయలసీమ జిల్లాల ప్రజలు సమస్యలు ఉంటే 8977716661కు కాల్ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నం. 91333 31912 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.