News March 19, 2025
గద్వాల: జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం సమీక్ష

ప్రఖ్యాత జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం సమీక్ష నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్లోని ప్రజా భవన్లో జరిగిన ఈ భేటీలో జోగులాంబ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికపై చిన్నారెడ్డి, అజయ్ కల్లం చర్చించారు.
Similar News
News November 28, 2025
MBNR: తొలిరోజు నామినేషన్లు ఎన్నంటే?

తొలి విడతలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 548 గ్రామ పంచాయతీల్లో సర్పంచు స్థానాలకు 441, వార్డు మెంబర్ స్థానాలకు 176 నామినేషన్లు దాఖలయ్యాయి. MBNR 137 గ్రామాలలో 108 మంది సర్పంచ్ పోస్టుకు నామినేషన్లు వేశారు. NRPT 67 గ్రామాల్లో 69 మంది, WNP 87 గ్రామాల్లో 75 మంది నామినేషన్ వేయగా.. గద్వాల 106 గ్రామాల్లో 68 పంచాయతీలకు సర్పంచ్ నామినేషన్లు వేశారు. ఇక NGKLలో 151 గ్రామాలు ఉండగా 121 దాఖలైయ్యాయి.
News November 28, 2025
జహిరాబాద్లో వివాహిత ఆత్మహత్య

భర్తతో విభేదాలు, వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జహీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్దిపాడుకు చెందిన స్వాతికి(22) ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు, అత్తమామ వేధిస్తున్నారని మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కాశీనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 28, 2025
ASF: పారామెడికల్ దరఖాస్తు గడువు పొడిగింపు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025-26 విద్యా సం. గాను DMLT (30), DECG (30) కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును DEC1 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు www.tgpmb.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు కళాశాల వెబ్సైట్ gmckumurambheem asifabad.orgను సంప్రదించాలని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.


