News March 11, 2025

గద్వాల: తల్లిదండ్రులు చనిపోయారు.. అనాథలుగా పిల్లలు

image

గద్వాల జిల్లా మల్దకల్ మండలం చర్లగార్లపాడు గ్రామంలో కొద్దిరోజుల క్రితం భారతి గుండెనొప్పితో మృతిచెందగా ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేక భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. గ్రామానికి చెందిన గడ్డమీది రాముడు తనవంతు సహాయంగా రూ.10,000 ఆర్థిక సహాయం మంగళవారం అందజేశారు. పేదింటికి చెందిన ఆ పిల్లలను దాతలు ఆదుకోవాలని ఆయన కోరాడు.

Similar News

News December 7, 2025

మునగాకు కషాయంతో బోలెడు ప్రయోజనాలు!

image

మునగాకు కషాయంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‘ఫ్రెష్ ఆకులను ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి మరిగించాలి. అవి మెత్తబడ్డాక వడకట్టి తాగాలి. మునగాకులను ఎండబెట్టి, పొడి చేసుకొని కూడా కషాయం చేసుకోవచ్చు. రోజూ పరగడుపున ఒక గ్లాసు ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. షుగర్, BP, కొవ్వు, జీర్ణ సమస్యల్ని నియంత్రిస్తుంది. రక్తహీనత తగ్గుతుంది, ఎముకలు బలపడతాయి’ అని చెబుతున్నారు.

News December 7, 2025

కరీంనగర్: పల్లెపోరులో స్థాయికి మించిన వాగ్దానాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థాయికి మించిన హామీ పత్రాలను పంచుతున్నారు. స్థానిక పన్నులు, కేంద్ర నిధులకు పరిమితమైన పంచాయతీకి భారీ వాగ్దానాలు చేస్తున్నారు. ఇవి ఎలా నెరవేరుతాయోనని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆచరణ సాధ్యతపై అనుమానాలు ఉన్నా, గెలుపు కోసం అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

News December 7, 2025

రెండో విడత ఎన్నికలు.. 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

image

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 23 సర్పంచ్, 306 వార్డులు స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. కామేపల్లి S-6 W-67, ఖమ్మం రూరల్ S-2 W-22, కూసుమంచి S-6 W-87, ముదిగొండ S-1 W-27, నేలకొండపల్లి S-3 W-50, తిరుమలాయపాలెం S-5 W-53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 6 మండలాల్లో మిగిలిన 160 సర్పంచ్, 1380 వార్డు స్థానాలకు ఈనెల 14న ఎన్నిక జరగనుంది.