News April 10, 2025
గద్వాల: నకిలీ విత్తనాలపై నిఘా.. రైతులను కాపాడే బాధ్యత పోలీసులదే: ఎస్పీ

నకిలీ విత్తనాలు జిల్లాలోకి రాకుండా, రైతులు మోసపోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాలో నిర్వహించిన పోలీసుల సమావేశంలో ఎస్పీ టి.శ్రీనివాసరావు పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ విధులు ప్రజల్లో నమ్మకం పెంచేలా ఉండాలని, నేరాల నియంత్రణ, శిక్షల శాతం పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 25, 2025
GHMC కౌన్సిల్ హాల్లో తగ్గేదే లే!

GHMC కీలక సమావేశానికి వేదికైంది. మరో 3 నెలల్లో పాలకవర్గం ముగియనుంది. మేయర్ అధ్యక్షతన నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, కొన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. చర్చల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ప్రతిపక్షాలు, ధీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ సభ్యులు కూడా తగ్గేదే లే అంటున్నారు.
News November 25, 2025
ఖమ్మం: అంతా ‘మొంథా’ర్పణం

ఖమ్మం జిల్లాలో ‘మొంథా’ తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ సర్వేచేసి తుది నివేదిక విడుదల చేసింది. జిల్లాలో 17మండలాల్లో 4,268మంది రైతులకు చెందిన 1, 710.72హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని తేల్చారు. 1,499.43 ఎకరాల్లో వరి, 115.82హెక్టార్లలో పత్తికి నష్టం వాటిల్లిందిని కలెక్టర్కు నివేదిక అందజేశారు. అత్యధికంగా కూసుమంచి డివిజన్లో 766.12 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
News November 25, 2025
నవ రసాలపాట.. నరసరావుపేట

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట నవరసాలలో ప్రఖ్యాతి గాంచింది. ఆధ్యాత్మిక, రాజకీయ, సాహిత్య, పత్రికా రంగాలలో ఇక్కడినుంచి ఎందరో ప్రముఖులు ప్రసిద్ధి చెందారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, తొలి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య, నవ్యాంధ్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, త్రివేణి పత్రిక సంపాదకులు కోలవెన్ను రామకోటేశ్వరరావు, మీసాల కృష్ణుడు బెల్లంకొండ సుబ్బారావు ఇక్కడి వారే.


