News April 10, 2025
గద్వాల: నకిలీ విత్తనాలపై నిఘా.. రైతులను కాపాడే బాధ్యత పోలీసులదే: ఎస్పీ

నకిలీ విత్తనాలు జిల్లాలోకి రాకుండా, రైతులు మోసపోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాలో నిర్వహించిన పోలీసుల సమావేశంలో ఎస్పీ టి.శ్రీనివాసరావు పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ విధులు ప్రజల్లో నమ్మకం పెంచేలా ఉండాలని, నేరాల నియంత్రణ, శిక్షల శాతం పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 6, 2025
సత్యసాయి బాబా సూక్తులు

● నీకు హాని చేసిన వారిని కూడా నువ్వు క్షమించాలి
● పరస్పర ప్రేమను అలవర్చుకోండి. ఎప్పుడూ ఆనందంగా, ముఖంపై మధురమైన చిరునవ్వుతో ఉండండి
● ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడకు
● ఎలాంటి కష్టాలు వచ్చినా భగవంతుడిపై విశ్వాసం కోల్పోకూడదు, విశ్వాసం ఉంటే ఎంతైనా సాధించొచ్చు.
News November 6, 2025
NZB: మహిళ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

నవీపేట్(M) ఫతేనగర్ శివారులో అక్టోబర్ 24న జరిగిన <<18089668>>మహిళ హత్య<<>> కేసులో ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు NZB ACP రాజావెంకట్ రెడ్డి తెలిపారు. ఫకీరాబాద్, కోస్గీ, మద్దేపల్లికి చెందిన సంగీత, మంగలి బాబు, పద్మ.. మృతురాలు శ్యామల లక్ష్మీ @ బుజ్జిని ఫతేనగర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశారు. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. డబ్బుల కోసం వారి మధ్య గొడవ జరిగిందని ACP వెల్లడించారు.
News November 6, 2025
SRP: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు శిబిరాలు

సింగరేణిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు నవంబర్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నెల 12, 13 తేదీల్లో శ్రీరాంపూర్, 17, 18 తేదీల్లో మందమర్రి, 24, 25 తేదీల్లో బెల్లంపల్లి, గోలేటి ఏరియాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ అవకాశాన్ని సీఎంపీఎస్, సీపీఆర్ఎంఎస్ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.


