News April 6, 2025

గద్వాల: ‘నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి’

image

చేనేత ఐక్యవేదిక సభ్యులు నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గద్వాల మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత పేర్కొన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో చేనేత ఐక్యవేదిక రూపొందించిన తెలుగు సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు సహకరిస్తానని చెప్పారు. మేడం రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 21, 2025

ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. పిండిమరతో బాంబుల తయారీ!

image

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో అరెస్టైన పుల్వామాకు చెందిన ముజమ్మిల్ షకీల్ గనై కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతను బాంబుల తయారీకి పిండిమరతో కెమికల్స్‌ను తయారు చేసినట్లు NDTV పేర్కొంది. ఫరీదాబాద్‌లోని తన రూమ్‌ను ఇందుకు వాడుకున్నాడని తెలిసింది. NOV 9న పోలీసులు ఇతని రూమ్‌లో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. యూరియాని పిండిమరలో వేసి అమ్మోనియం నైట్రేట్ తయారు చేసినట్లు సమాచారం.

News November 21, 2025

అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు

image

గంజాయి సరఫరా, విక్రయాలకు పాల్పడిన ఐదుగురి ముఠాకు 10 ఏళ్లు జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. (గంగాధర్, స్వాతి, ప్రసాద్, షేక్ గౌసియా, షేక్ అలీ) నిందితులకు శిక్ష పడేలా కృషిచేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ జగదీశ్ అభినందించారు. షేక్ అలీ గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామం కాగా మిగిలిన నలుగురు అనంతపురానికి చెందినవారే.

News November 21, 2025

వేములవాడ ఏఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే నియమితులయ్యారు. గ్రేహౌండ్స్ విభాగం ఏఎస్పీగా పనిచేస్తున్న 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయనను వేములవాడకు బదిలీ చేస్తూ శుక్రవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేములవాడలో అదనపు ఎస్పీ హోదాలో పనిచేస్తున్న శేషాద్రిని రెడ్డిని జగిత్యాల అదనపు ఎస్పీ (పరిపాలన)గా నియమించారు.