News April 6, 2025
గద్వాల: ‘నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి’

చేనేత ఐక్యవేదిక సభ్యులు నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గద్వాల మాజీ జడ్పీ ఛైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో చేనేత ఐక్యవేదిక రూపొందించిన తెలుగు సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. జిల్లాలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు సహకరిస్తానని చెప్పారు. మేడం రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 18, 2025
కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం

బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం నాల్గో గురువారం సందర్భంగా సహస్ర ఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈఓ శోభారాణి చేతులు మీదుగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
మార్గశిర మాసం చివరి గురువారం కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈఓ శోభరాని అన్ని ఏర్పాట్లు చేశారు.
News December 18, 2025
ప.గో: ACB DSPగా కృష్ణారావు ఛార్జ్

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అవినీతి నిరోధక శాఖ DSPగా జి.వి కృష్ణారావు ఏలూరు ACB కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అవినీతి సమాచారంపై ప్రజలు నిర్భయంగా ఫోన్ ద్వారా కానీ, ఆఫీసుకు వచ్చిగాని తెలియజేయవచ్చని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని లేదా వారి మొబైల్ నెంబర్ 9440441657కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా, సమాచారం అందించినా వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు.
News December 18, 2025
కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి భారీ ఆదాయం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల సందర్భంగా హుండీలను 17, 18 డిసెంబర్ 2025 తేదీల్లో తెరచి లెక్కించారు. రెండు రోజుల్లో మొత్తం నగదు రూ.4,49,13,187, బంగారం 218 గ్రాములు, వెండి 17 కిలోలు 324 గ్రాములు లభించాయి. అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఖతార్ సహా పలు దేశాల విదేశీ కరెన్సీ సమర్పణలు వచ్చినట్లు దేవస్థానం ఈవో శీనానాయక్ తెలిపారు.


