News February 1, 2025
గద్వాల: పాఠశాల ఘటనలో ఉపాధ్యాయురాలు సస్పెండ్

గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థినిని వాతలు పడేలా కొట్టిన ఉపాధ్యాయురాలిని పాఠశాల విధుల నుంచి తొలగించామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. అదే విధంగా విద్యార్థికి అయ్యే వైద్య ఖర్చుల మొత్తాన్ని పాఠశాల యాజమాన్యం భరిస్తుందని అన్నారు.
Similar News
News February 23, 2026
ఏప్రిల్ 8న AA22 ఫస్ట్ టీజర్?

అట్లీ- అల్లు అర్జున్ కాంబినేషన్లో AA22 మూవీ షూటింగ్ సగం పూర్తయినట్లు సమాచారం. తదుపరి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ టీజర్ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ పెరిగింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణే, రష్మిక, మృణాల్, జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే.
News February 23, 2026
HYD: తెలుగు వర్సిటీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో TG ప్రభుత్వ సంగీత, నృత్యశాఖలో ఈ ఏడాదికి గానూ సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల వార్షిక పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారిణి ఎంవీ ఆదిలక్ష్మి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఫైన్ లేకుండా మార్చి 10లోగా, రూ.1,000 ఫైన్తో మార్చి 30లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 8143165646ను సంప్రదించవచ్చు. site: pstucet.org
News February 23, 2026
తిరుపతి: మొదటి రోజు 797మంది ఆబ్సెంట్

తిరుపతి జిల్లాలో ఇంటర్ మొదటి సం. పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన పరీక్షకు 797మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. మొత్తం 31014 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 30217 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.


