News February 8, 2025

గద్వాల: ‘పెండింగ్‌ ధరణీ దరఖాస్తులను పూర్తి చేయాలి’

image

పెండింగ్‌లో ఉన్న ధరణీ దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ నారాయణ తహశీల్దార్లకు ఆదేశించారు. శనివారం గద్వాల కలెక్టర్ కలెక్టరేట్లోని హాల్‌లో మండలాల తహశీల్దార్లతో ధరణి, మీ సేవ కేంద్రాలలో దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాల వివరాలు, బర్త్, డెత్ సర్టిఫికెట్లు నిర్దేశించిన కాలంలో చేయాలని సూచించారు.

Similar News

News March 24, 2025

‘ఉమ్మడి MBNR జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మించండి’

image

దిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మించాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో పెద్ద విస్తీర్ణం గల జిల్లా మహబూబ్నగర్ అని గుర్తు చేసి, ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మించడంతో రవాణా సౌకర్యం, ప్రజలకు ఉపాధి లభిస్తుందని కోరారు.

News March 24, 2025

సీఎం పుట్టినరోజున ‘చంద్రన్న నాటకోత్సవాలు’

image

AP: వచ్చే నెల 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని వారం పాటు ‘చంద్రన్న నాటకోత్సవాలు’ నిర్వహించనున్నట్లు ఏపీ నాటక అకాడమీ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 20-26 వరకు జరిగే వేడుకల్లో నాటికలు, పౌరాణిక/సాంఘిక నాటకాలు, పద్య నాటకాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తామని పేర్కొంది. ఆసక్తిగలవారు వివరాలు, సాధించిన విజయాలు, ప్రదర్శించే నాటక వివరాలను వెల్లడిస్తూ నాటక <>అకాడమీ చిరునామాకు<<>> పంపాలని కోరింది.

News March 24, 2025

రేపు 52 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో రేపు 52, ఎల్లుండి 88 మండలాల్లో <>వడగాలులు<<>> వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూ.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ALERT జారీ చేసింది. ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. అలాగే పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

error: Content is protected !!