News February 3, 2025
గద్వాల ప్రజావాణిలో 28 దరఖాస్తులు.!

గద్వాల జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 28 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 25, 2026
మంచిర్యాల: 8 మంది మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. శనివారం సీపీ కార్యాలయంలో మలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగాలకు చెందిన ఎనిమిది మంది మావోయిస్టులు ఎదుట లొంగిపోయారు. సీపీ మాట్లాడుతూ.. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందించే పునరావాస పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
News January 25, 2026
అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలైన ఏడుగురికి పీవోఏ యాక్ట్ కింద ఐటీఐ, అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వారికి నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
News January 25, 2026
KNR: పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.. ఆదమరిస్తే అంతే!

ఉమ్మడి KNR జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి, మానేరు నది తీరాన పురాతన శిథిలావస్థలోని ఆలయాలు, రామగిరి ఖిల్లా, ధూళికట్ట బౌద్ధక్షేత్రంతో పాటు జలాశయాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేలా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ ప్రాంతంలోని పురాతన దేవాలయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చెయ్యండి.


