News April 8, 2025
గద్వాల: ప్రతి గింజను కొనుగోలు చేయాలి: అదనపు కలెక్టర్

2024-25 యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల జిల్లా కలెక్టరేట్లో రబీ యాక్షన్ ప్లాన్పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు.
Similar News
News December 5, 2025
అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. రేపు రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్<<>>ను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా తాజాగా రిలీజ్ను కూడా వాయిదా వేశారు.
News December 5, 2025
టుడే టాప్ స్టోరీస్

*రష్యా అధ్యక్షుడు పుతిన్ను రిసీవ్ చేసుకున్న ప్రధాని మోదీ
*హార్టికల్చర్ హబ్కి కేంద్రం రూ.40వేల కోట్లు ఇస్తోంది: చంద్రబాబు
*తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్
*ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు ప్రారంభం: రేవంత్
*’హిల్ట్’ పేరుతో కాంగ్రెస్ భూకుంభకోణం: KTR
*మరోసారి కనిష్ఠానికి రూపాయి.. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూ.90.43కి పతనం
News December 5, 2025
వనపర్తి జిల్లా TODAY.. టాప్ NEWS

>WNP సర్పంచ్ పదవికి MBBS విద్యార్థిని నిఖిత పోటీ
>WNP: పెద్దగూడెంలో బీజేపీలో భారీ చేరికలు
>WNP: CM దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: BJP
>PNGL: ఈ ప్రయాణం ప్రమాదకరం
>WNP: బడి బయటి పిల్లలను పాఠశాలలకు పంపించాలి
>GPT: కక్షపూరిత రాజకీయాలను మానుకోవాలి: BRS
>ATKR: ఎన్నికల విధులు బాధ్యత ఈ విధంగా నిర్వహించాలి: ఎంపీడీఓ
>WNP: అభ్యర్థులకు వ్యాయ నిబంధనలపై అవగాహన కల్పించాలి


