News April 8, 2025
గద్వాల: ‘ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడాలి’

గద్వాల మున్సిపాలిటీ 17వ వార్డులోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో అన్యాక్రాంతానికి గురైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్కు స్థానికులు వినతి పత్రం సమర్పించారు. 17వ వార్డు పాత హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ భూమిని రాజకీయ ప్రమేయంతో కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని సీనియర్ సిటిజనం ఫోరం అధ్యక్షుడు మోహన్రావు అన్నారు.
Similar News
News October 13, 2025
సూర్యాపేట: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

MBNR (D) సీసీ కుంటలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మఠంపల్లి మండలం బోజ తండాకు చెందిన చందర్ నాయక్ ప్రేమ పేరుతో అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బాలికను సఖి కేంద్రానికి తరలించినట్లు సీసీ కుంట సీఐ రామకృష్ణ తెలిపారు.
News October 13, 2025
ప్రకాశం SP మీకోసంకు 71 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఏఎస్పీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు ఎస్పీ మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో వారు మాట్లాడి సంబంధిత పోలీస్ స్టేషన్లకు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.
News October 13, 2025
HYD: మీర్పేట్ మాధవి హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు

HYD బాలాపూర్ పరిధి మీర్పేట్ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈనెల 17 నుంచి రోజువారీ జిల్లా ట్రయల్ కోర్టు విచారణ జరపనుంది. మాధవిని ఆమె భర్త గురుమూర్తి హత్య చేసి, ముక్కలు చేసి, కుక్కర్లో ఉడుకబెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో సైంటిఫిక్ ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. 2 నెలల్లో తీర్పు వస్తుందని సీపీ సుధీర్బాబు వెల్లడించారు.