News March 11, 2025

గద్వాల: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

image

శాంతినగర్ పట్టణంలో జబల్ దేవాలయం వెనకాల ఉన్న బావిలో మద్దిలేటి (36) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు కథనం ప్రకారం వివరాలు.. మద్దిలేటికి సంబంధించిన బంధువులు దేవర చేస్తున్నారని దేవాలయానికి వచ్చిన అతను బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. అతను కల్లుకంట గ్రామవాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 5, 2026

సెమీస్.. భారత్ భారీ స్కోర్

image

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.

News March 5, 2026

పార్వతీపురం: ఆర్ అండ్ బీ పనుల్లో వేగం పెంచాలి

image

జిల్లాలో కొనసాగుతున్న రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 1,030 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల నెట్‌వర్క్ ఉందని, ఇందులో 464 కి.మీ. స్టేట్ హైవేలు, 566 కి.మీ. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు ఉన్నాయని తెలిపారు. మెజారిటీ పనులు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని పూర్తి చేయాలన్నారు.

News March 5, 2026

బాలీవుడ్ మూవీలా పశ్చిమాసియా పాలిటిక్స్!

image

పశ్చిమాసియా జియో పాలిటిక్స్ బాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నాయంటూ <<18418395>>హర్ష్ గోయెంకా<<>> ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్‌ వెంట IND ఉంది. USతో ఇజ్రాయెల్, పాక్‌తో US, ఇరాన్‌ వెంట PAK ఉంది. అయితే IND-PAK శత్రువులుగానే ఉన్నాయి. ఇది ‘ముఖద్దర్ కా సికందర్‌’ మూవీని గుర్తు చేస్తోంది. రేఖను అంజాద్ ప్రేమిస్తారు. అమితాబ్‌ను రేఖ, రాఖీని అమితాబ్, వినోద్‌ను రాఖీ లవ్ చేస్తారు. అయితే అంజాద్, అమితాబ్ శత్రువులే’’ అని పేర్కొన్నారు.