News March 20, 2025

గద్వాల బార్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక

image

గద్వాల్ బార్ అసోసియేషన్ ఎలక్షన్లు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా శ్యామ్ సుందర్ రావు, ఉపాధ్యక్షుడిగా గుండయ్య, కార్యదర్శిగా షఫీ ఉల్లా, సంయుక్త కార్యదర్శిగా దామోదర్, కోశాధికారిగా విశ్వనాధ్ గౌడ్, గ్రంథాలయం కార్యదర్శిగా మన్యం కొండా, కార్యనిర్వాహక సభ్యులుగా మాధవి లత, వెంకట్ రమణారెడ్డి, శేషిరెడ్డి, మధుసూదన్ బాబును ఎన్నుకున్నారు.

Similar News

News November 26, 2025

అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుద్దాం: SP

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం సిరిసిల్లలోని పోలీసు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటామని ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేశారు.

News November 26, 2025

ఏలూరు: ఒడిశా టూ హైదరాబాద్ అక్రమ రవాణా

image

పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి పోలీసులు బుధవారం నిర్వహించిన విస్తృత వాహన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణా వెలుగుచూసింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా లారీలో తరలిస్తున్న గోవులను గుర్తించి పట్టుకున్నారు. గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

News November 26, 2025

సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

image

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.