News February 1, 2025

గద్వాల: బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేజీ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 14, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔ఘనంగా ‘ల్యాబ్ టెక్నీషియన్ డే’
✔రేపే హోలీ..ఊపందుకున్న రంగుల కొనుగోళ్ళు
✔ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి
✔వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్
✔GWL:విద్యారంగానికి నిధులు కేటాయించాలి:BRSV
✔ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలి:ఎస్పీలు
✔ఉమ్మడి జిల్లాలో దంచికొడుతున్న ఎండలు
✔SLBC దుర్వాసన వస్తున్నా… అంతు చిక్కడం లేదు
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News March 13, 2025

MBNR: ప్రతి దరఖాస్తు పరిష్కరించుకునేలా చూడాలి: కలెక్టర్

image

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం 31,190మంది దరఖాస్తు చేసుకోగా ప్రతి ఒక్కరు పరిష్కరించుకునేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆర్పిలకు సూచించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి దరఖాస్తుదారుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఈ నెలాఖరు లోగా పరిష్కరించుకుంటే 25% రాయితీ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని వారికి వివరించాలన్నారు.

News March 13, 2025

MBNR: క్రమబద్ధీకరించుకుని రాయితీ పొందండి: కలెక్టర్

image

అనధికార ప్లాట్లు లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని 31190 మంది దరఖాస్తుదారులు క్రమబద్ధీకరించుకుని 25% రాయితీని పొందుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. ముందుకు వచ్చిన దరఖాస్తుదారుడికి వెంటనే పరిష్కరించేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!