News March 17, 2025

గద్వాల: మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు: కలెక్టర్

image

వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సంతోశ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని IDOC భవనంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. తలపై గుడ్డలు, టోపీలు, రూమాలు ధరించాలన్నారు.

Similar News

News November 10, 2025

PM కిసాన్ లిస్టులో మీ పేరు లేదా? కారణమిదే!

image

PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి లక్షలాది మంది లబ్ధిదారులను తొలగించారన్న ప్రచారంపై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘గైడ్‌లైన్స్ ప్రకారం 2019 FEB 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. ఒకే ఫ్యామిలీ నుంచి భర్త, భార్య, పిల్లలు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం. అలాంటి వారికి తాత్కాలికంగా నిలిపివేశాం. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అర్హులని తేలితే మళ్లీ జాబితాలో చేర్చుతాం’ అని పేర్కొంది.

News November 10, 2025

రేపే సీఎం రాక.. బందోబస్తు వివరాలు వెల్లడించిన ఎస్పీ!

image

రేపు పీసీపల్లి మండలంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన బందోబస్తు వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 49 మంది ఎస్‌ఐలతో పాటు మొత్తం 800 మంది పోలీసులు, హోం గార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా 6 ప్రత్యేక మొబైల్ బైక్ పెట్రోలింగ్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు.

News November 10, 2025

మక్తల్‌లో జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు ప్రారంభం

image

మక్తల్ మినీ స్టేడియం మైదానంలో సోమవారం ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను జిల్లా క్రీడల శాఖ అధికారి (డీవైఎస్‌ఓ) వెంకటేష్ ప్రారంభించారు. 14 నుంచి 17 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఈ క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, విజేతలను ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.