News March 17, 2025
గద్వాల: మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు: కలెక్టర్

వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సంతోశ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని IDOC భవనంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. తలపై గుడ్డలు, టోపీలు, రూమాలు ధరించాలన్నారు.
Similar News
News October 27, 2025
గన్నవరం నుంచి వైజాగ్ వెళ్లే ఫ్లైట్ రద్దు

విశాఖపట్నంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల గన్నవరం విమానాశ్రయం నుంచి వైజాగ్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు సోమవారం సాయంత్రం తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
News October 27, 2025
NGKL: పారదర్శకంగా కొనసాగిన మద్యం దుకాణాల కేటాయింపు

జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా కొనసాగిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఉదయం 11 గంటలకు ప్రారంభించినట్లు తెలిపారు. 67 దుకాణాలకు గాను మొత్తం 1518 దరఖాస్తులు రావడంతో దరఖాస్తుదారుల సమక్షంలో మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందని తెలిపారు.
News October 27, 2025
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.


