News March 17, 2025

గద్వాల: మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు: కలెక్టర్

image

వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సంతోశ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని IDOC భవనంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. తలపై గుడ్డలు, టోపీలు, రూమాలు ధరించాలన్నారు.

Similar News

News March 18, 2025

బాపట్ల: 44 కేంద్రాలలో ఫ్లైయింగ్ స్క్వాడ్‌ల తనిఖీలు

image

బాపట్ల జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి పరీక్షలలో జిల్లా వ్యాప్తంగా 6 ఫ్లయింగ్ స్క్వాడ్లు ద్వారా 103 కేంద్రాలలో 44 పరీక్ష కేంద్రాలలో తనిఖీలు నిర్వహించామని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం ప్రకటించారు. పరీక్షలకు మొత్తం 16,481 మంది విద్యార్థులకు గాను16,247 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.

News March 18, 2025

ఎన్టీఆర్: అమరావతిలో నిర్మాణ పనులకు క్యాబినెట్‌ ఆమోదం

image

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి పలు అంశాలకు ఆమోదం లభించింది. సీఆర్డిఏ ఆధ్వర్యంలో జరిగే 22 పనులకు L1 బిడ్డర్లను అనుమతించేందుకు, ఏడీసీఎల్ ఆధ్వర్యంలో జరిగే రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనులకు పరిపాలనా అనుమతులకు క్యాబినెట్ ఓకే చెప్పింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ పనులకు సంబంధించి కరెన్సీ సీలింగ్ క్లాజ్ అగ్రిమెంట్‌‌లో సవరణను ఆమోదించింది.

News March 18, 2025

ట్రిపుల్ ఐటీలకు మే7 నుంచి వేసవి సెలవులు

image

రాజీవ్ గాంధీ సాంకేతిక వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (ఆర్జీయుకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీలకు మే 7తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ఆర్జీయూకేటీ రిజిస్టర్ ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. నూజివీడులో ఆయన సోమవారం మాట్లాడుతూ.. వేసవి సెలవుల అనంతరం జూన్ 30వ తేదీన క్లాసులు పునఃప్రారంభం అవుతాయన్నారు. బాలికలను గమ్యస్థానాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

error: Content is protected !!