News April 4, 2025
గద్వాల: మహిళా డిగ్రీ కాలేజీలో మాదక ద్రవ్యాలపై అవగాహన

గద్వాలలోని మహిళా డిగ్రీ కాలేజీలో ఈరోజు ప్రిన్సిపల్ Dr.A.మీనాక్షి అధ్యక్షతన విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. యువతను డ్రగ్స్ ముఠా టార్గెట్ చేసి మాదక ద్రవ్యాలను అలవాటు చేసి, వ్యాపారం చేయిస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. తాత్కాలిక సంతోషాల కోసం బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు.
Similar News
News December 12, 2025
మంత్రి సీతక్క పర్యటించిన దక్కని ఫలితం..!

ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన తడ్వాయి, ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ రెండు పంచాయతీల్లో గెలుపు లక్ష్యంగా మంత్రి సీతక్క పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ 2 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఏటూరునాగారంలో సుమారు 3000 పైచిలుకు భారీ మెజారిటీతో ప్రత్యర్థి పార్టీ గెలవడం పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.
News December 12, 2025
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.
News December 12, 2025
‘టెన్త్’ షెడ్యూల్పై వివాదం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వివరణ

TG: టెన్త్ పరీక్షల షెడ్యూల్ (MAR 14-APR 16) <<18526038>>వివాదంపై<<>> స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వివరణ ఇచ్చారు. ‘పేరెంట్స్, స్టూడెంట్స్ రిక్వెస్ట్తో పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఇచ్చాం. CBSE, ఇతర బోర్డుల విధానాలను అధ్యయనం చేసి సైంటిఫిక్గా షెడ్యూల్ రూపొందించాం. మ్యాథ్స్, సైన్స్, సోషల్కు ఎక్కువ రోజులు సెలవులిచ్చాం. స్టూడెంట్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రివిజన్ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.


