News March 17, 2025

గద్వాల: మొసలి దాడిలో వ్యక్తి మృతి

image

గద్వాల మండలంలో మొసలి దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జరిగింది. పోలీసుల వివరాలు.. UPకి చెందిన రబీదాస్(21) గుర్రంగడ్డలో వంతెన పని చేసుకోవడానికి వలస వచ్చాడు. హోలీ పండగ సందర్భంగా స్నేహితులతో మద్యం తాగాడు. స్నేహితులు వెళ్లాక.. అతడు నదీతీర ప్రాంతంలో ఫోన్ మాట్లాడుతుండగా మడుగులో నుంచి మొసలి వచ్చి అతడిని నదిలోకి లాక్కెళ్లింది. ఆదివారం ఉదయం రైతులకు అతడి నదిలో అతడి మృతదేహం కనిపించింది. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News November 18, 2025

మహబూబాబాద్: తండ్రి కళ్ల ముందే కొడుకు ప్రాణం విలవిల..!

image

తన కళ్ల ముందే తన కొడుకు విలవిల కొట్టుకుంటూ చనిపోతుంటే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్(D) తొర్రూర్(M) పోలేపల్లికి చెందిన ధరావత్ వనిత, విశ్వనాథ్ దంపతుల కుమారుడు రామ్‌చరణ్(17). తమ పొలంలో వడ్లు తెచ్చేందుకు తండ్రి నడుపుతున్న ట్రాక్టర్‌పై కూర్చొని రామ్‌చరణ్ వెళ్లాడు. గట్టు ఎక్కిస్తున్న క్రమంలో ట్రాలీలో ఉన్న రామ్‌చరణ్ కింద పడగా అతడిపై నుంచి చక్రం వెళ్లడంతో చనిపోయాడు.

News November 18, 2025

మహబూబాబాద్: తండ్రి కళ్ల ముందే కొడుకు ప్రాణం విలవిల..!

image

తన కళ్ల ముందే తన కొడుకు విలవిల కొట్టుకుంటూ చనిపోతుంటే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్(D) తొర్రూర్(M) పోలేపల్లికి చెందిన ధరావత్ వనిత, విశ్వనాథ్ దంపతుల కుమారుడు రామ్‌చరణ్(17). తమ పొలంలో వడ్లు తెచ్చేందుకు తండ్రి నడుపుతున్న ట్రాక్టర్‌పై కూర్చొని రామ్‌చరణ్ వెళ్లాడు. గట్టు ఎక్కిస్తున్న క్రమంలో ట్రాలీలో ఉన్న రామ్‌చరణ్ కింద పడగా అతడిపై నుంచి చక్రం వెళ్లడంతో చనిపోయాడు.

News November 18, 2025

నవంబర్ 18: చరిత్రలో ఈరోజు

image

*1901: సినీ దర్శకుడు, నిర్మాత వి.శాంతారాం జననం
*1929: తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటి బీఎస్ సరోజ జననం
*1962: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (ఫొటోలో)
*1963: పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభం
*1984: నటి నయనతార జననం
*1994: కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు మరణం