News March 22, 2025
గద్వాల: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT
Similar News
News November 18, 2025
KMR: పలువురిని ఆకట్టుకున్న విద్యార్థిని సందేశం

కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో డ్రగ్స్ పై ఏఎస్పీ చైతన్య రెడ్డి అడిగిన ప్రశ్నకు ఓ విద్యార్థి ఇచ్చిన సమాధాన సందేశం పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థులు యువత డ్రగ్స్ ఎందుకు తీసుకోకూడదు విద్యార్థిని వివరించింది. “దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు,యువతే ముఖ్య కారణం,అలాంటి యువత IAS,IPSలు కాకుండా అడ్డుకునేది డ్రగ్స్” అని సందేశం ఇచ్చారు.
News November 18, 2025
KMR: పలువురిని ఆకట్టుకున్న విద్యార్థిని సందేశం

కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో డ్రగ్స్ పై ఏఎస్పీ చైతన్య రెడ్డి అడిగిన ప్రశ్నకు ఓ విద్యార్థి ఇచ్చిన సమాధాన సందేశం పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థులు యువత డ్రగ్స్ ఎందుకు తీసుకోకూడదు విద్యార్థిని వివరించింది. “దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు,యువతే ముఖ్య కారణం,అలాంటి యువత IAS,IPSలు కాకుండా అడ్డుకునేది డ్రగ్స్” అని సందేశం ఇచ్చారు.
News November 18, 2025
‘రాయలసీమ’ పేరుకు నేటికి 97 ఏళ్లు!

బ్రిటిష్ కాలంలో ‘దత్త మండలం’గా పిలవబడిన మన ప్రాంతానికి ‘రాయలసీమ’ అనే పేరు పెట్టి నేటికి 97ఏళ్లు పూర్తయ్యాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు ఈ పేరును ప్రతిపాదించారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలుకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ‘‘రాయలసీమ’’ అనే పేరును ప్రతిపాదించారు. పప్పూరు రామాచార్యులు ఈ ప్రతిపాదనను బలపరచగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.


