News March 22, 2025

గద్వాల: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

image

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT

Similar News

News November 24, 2025

4,116 పోస్టులు.. రేపటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

image

RRC నార్తర్న్ రైల్వే 4,116 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ITI అర్హతగల వారు రేపటి నుంచి DEC 24వరకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, కార్పెంటర్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. టెన్త్, ITIలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: rrcnr.org * మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 24, 2025

ASPT: మనవడి మరణం తట్టుకోలేక నాయనమ్మ మృతి

image

అశ్వారావుపేట మండలం దొంతికుంటలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో వాగులో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థి యశ్వంత్ (15) ఈత రాక మునిగి మృతి చెందాడు. మనవడి మరణవార్త విని తట్టుకోలేక నాయనమ్మ వెంకమ్మ (65) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

News November 24, 2025

వరంగల్: డిసెంబర్ బియ్యం కోటా విడుదల

image

ఉమ్మడి జిల్లాలో రేషన్ షాపులకు సన్న బియ్యం అలాట్ అయ్యింది. HNK జిల్లాకు 4,789.54 మెట్రిక్ టన్నులు, జనగామ 3,548.47, భూపాలపల్లి 2,526.02, మహబూబాబాద్ 5,209.91, ములుగు 1,906.28, WGL 5,509.8 మెట్రిక్ టన్నులను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,10,124.53 మెట్రిక్ టన్నుల కోటాను డిసెంబరు కోసం విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలోనే ముందుగానే సన్నబియ్యాన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నారు.