News March 22, 2025
గద్వాల: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT
Similar News
News September 13, 2025
హుజూర్నగర్: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

హుజూర్నగర్లో విషాదం చోటుచేసుకుంది. భర్త మరణించిన మూడు రోజులకే భార్య మృతి చెందారు. పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి అప్పారావు గుండెపోటుతో సెప్టెంబర్ 10న మృతి చెందారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని భార్య గెల్లి అరుణ శనివారం మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
News September 13, 2025
అలంపూర్లో భక్తుల రద్దీ

అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం మహా నివేదన సమయంలో భక్తులు దర్శనాల కోసం వేచి చూశారు. అనంతరం హారతులు అందుకున్నారు.
News September 13, 2025
బీటెక్ అర్హత.. CRDAలో 132 ఉద్యోగాలు

ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(AP CRDA)లో 132 ఇంజినీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26 చివరి తేదీ. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు చేయనున్నారు. ఆయా విభాగాల్లో బీటెక్ పాసైన వారు అర్హులు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. పూర్తి వివరాల కోసం <