News April 12, 2025

గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

image

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News October 29, 2025

మిడ్జిల్‌లో అత్యధిక వర్షపాత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మిడ్జిల్ మండల కేంద్రంలో 119.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. జడ్చర్ల 84.8, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 82.8, బాలానగర్ 68.0, నవాబుపేట మండలం కొల్లూరు 64.3, మూసాపేట మండలం జానంపేట 63.0, మహమ్మదాబాద్, రాజాపూర్ 53.0, భూత్పూర్ 41.5, మహబూబ్ నగర్ గ్రామీణం 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 29, 2025

MBNR: భారీ వర్షాలు… పాఠశాలలకు నేడు సెలవు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారీ వర్షం వల్ల నేటి ఎస్ఏ-1 (SA-1) పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

News October 29, 2025

MBNR: ‘మొంథా’ నేపథ్యంలో వరి కోతలు నిలిపివేయాలి: ఏఈఓ

image

‘మొంథా’ తీవ్ర తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వరి కోత పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏఈఓ యన్. హర్షవర్ధన్ సూచించారు. తుఫాను పూర్తిగా తగ్గిన తర్వాతే కోతలు ప్రారంభించాలని కోరారు. వర్షం కారణంగా పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కోసిన ధాన్యం నిల్వలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆయన రైతులకు తెలిపారు.