News April 12, 2025

గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

image

మల్దకల్ వాసి రామకృష్ణ(35) శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని, వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యే అంటూ భార్య ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 24, 2025

పోచంపల్లి : బైక్‌ పైనుంచి పడి యువకుడు మృతి

image

భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మున్సిపల్ కేంద్రానికి చెందిన పొట్టబత్తిని సాయి కుమార్ (25) ఆదివారం రాత్రి ఫంక్షన్ నుంచి వస్తుండగా కుక్క అడ్డు రావడంతో బైక్‌పై నుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో సాయి కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.

News November 24, 2025

భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

image

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.

News November 24, 2025

రాజాం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

image

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన రాజాం సారధి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాజాంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న ఉర్లాపు సావిత్రి (30) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సావిత్రి ఉరి వేసుకుని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి భర్త, కొడుకు, కుమర్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థ‌లాన్ని ప‌రిశీలించారు.