News April 12, 2025

గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

image

మల్దకల్ వాసి రామకృష్ణ(35) శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని, వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యే అంటూ భార్య ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 10, 2025

ఖమ్మం రోడ్లపై ధాన్యం రాశులు.. ప్రమాద భయం

image

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ ధాన్యాన్ని ఆరబోయడానికి మార్కెట్‌ యార్డుల కొరత ఉండటంతో రైతులు పంటను ప్రధాన రహదారులపైనే పోస్తున్నారు. దీంతో వడ్ల రాశులు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయి వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు మార్కెట్‌ యార్డులను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News November 10, 2025

సిద్దిపేట: ప్రతిభకు మారుపేరు అందెశ్రీ !

image

సిద్దిపేట జిల్లా రేబర్తికి చెందిన ప్రజాకవి అందెశ్రీ ఇక లేరన్న విషయం బాధిస్తోంది. ప్రతిభకు మారుపేరుగా నిలిచిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లాలో కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణ జననీ జయకేతనం, పల్లెనీకు వందనములమ్మో, మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా.. జన జాతరలో మన గీతం, యెల్లిపోతున్నావా తల్లి పాటలు ప్రసిద్ధి చెందాయి.

News November 10, 2025

జూబ్లీహిల్స్ బై పోల్: డెమో తర్వాత అసలు ఓటింగ్!

image

రేపు సూర్యుడు ఉదయించే లోపే(5AM) జూబ్లీహిల్స్ బై పోల్‌లో పోటీలో ఉన్న క్యాండిడేట్లందరూ (58 మంది) ఓటేస్తారు. అది తాము వేసిన గుర్తుకే పడిందా? లేదా? అనేది నిర్ధారించుకుంటారు. డెమో ఓకే అయితేనే సంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత మోడల్ బ్యాలెట్ జరిగినట్లు PO అధికారికంగా ధ్రువీకరిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటలకు అసలు ఎన్నిక మొదలవుతుంది.