News April 12, 2025

గద్వాల: రామకృష్ణ సూసైడ్.. పోలీసుల దర్యాప్తు

image

మల్దకల్ వాసి రామకృష్ణ శుక్రవారం <<16064365>>సూసైడ్ చేసుకున్న<<>> విషయం తెలిసిందే. గద్వాలకు చెందిన శ్రీవాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో తన భర్తకు పరిచయం ఉందని,వారికి మనస్పర్థలు రావడంతో నిత్యం వేధించిందని, అందుకే చనిపోయాడని రామకృష్ణ భార్య ఆరోపించారు. తమ కంటే ముందే రామకృష్ణ మృతదేహాన్ని ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఇది హత్యేనని భార్య ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News April 19, 2026

గుంటూరులో నేడు బంగారం ధర ఎంతంటే?

image

అక్షయ తృతీయ కావడంతో గుంటూరు జిల్లాలో బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. గుంటూరులో ఆదివారం 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ రూ. 1,57,934 పలుకుతోంది. 22 క్యారెట్ 10 గ్రాములు రూ. 1,43,600 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ. 263గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.

News April 19, 2026

GNT: వై.ఎస్ విజయమ్మకు లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

image

వై.ఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ‘x’ వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీమతి వై.ఎస్. విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో ఆమె మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాము’. అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

News April 19, 2026

తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

image

AP CM చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. NDA అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఈ నెల 20, 21వ తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే CBN ప్రచారం సాగనుంది. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలు, రోడ్డు షోలలో పాల్గొననున్నారు. TNలో ఏప్రిల్ 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.