News January 24, 2025
గద్వాల: రూ.63.25 కోట్లతో తాగునీటి పథకం ప్రారంభం

గద్వాల మున్సిపల్ పరిధిలో వచ్చే 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య ఉండకుండా అమృత్ 2.0 పథకం కింద చేపట్టే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గద్వాల పట్టణంలో నది అగ్రహారం ఫిల్టర్ బెడ్ వద్ద అమృత్ 2.O పథకం కింద రూ.63.25 కోట్ల వ్యయంతో నీటి సరఫరా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ సంతోష్ తో శంకుస్థాపన చేశారు.
Similar News
News December 6, 2025
VKB: 3వ విడతలో 909 నామినేషన్లు

వికారాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో మొత్తం 157 జీపీలకు 909 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల కోసం 3,055 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిల్లో పరిగి నియోజకవర్గంలోని మండలాల్లోనే 1,340 వార్డు స్థానాలు ఉన్నాయి. కాగా ఈ విడతలో మొత్తం 157 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుకలెక్టర్ తెలిపారు.
News December 6, 2025
TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి

AP: తెలంగాణపై పవన్ కళ్యాణ్ <<18394542>>దిష్టి<<>> వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. BJP, జనసేన, TDP పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.
News December 6, 2025
విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా: హరీశ్

TG: కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ‘రైతులకు యూరియా సరఫరా చేయలేని రేవంత్.. విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారు. చేసిందేమీ లేక గప్పాలు కొట్టారు. గ్లోబల్ సమ్మిట్, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న CM ముందు యూరియా సరఫరాపై దృష్టి పెట్టాలి. క్యూలైన్లలో రైతులు నరకం చూస్తున్నారు’ అని మండిపడ్డారు.


