News January 24, 2025

గద్వాల: రూ.63.25 కోట్లతో తాగునీటి పథకం ప్రారంభం

image

గద్వాల మున్సిపల్ పరిధిలో వచ్చే 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య ఉండకుండా అమృత్ 2.0 పథకం కింద చేపట్టే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గద్వాల పట్టణంలో నది అగ్రహారం ఫిల్టర్ బెడ్ వద్ద అమృత్ 2.O పథకం కింద రూ.63.25 కోట్ల వ్యయంతో నీటి సరఫరా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ మల్లు ర‌వి, కలెక్టర్ సంతోష్ తో శంకుస్థాపన చేశారు.

Similar News

News January 5, 2026

గొర్రెల పెంపకం – సాంద్ర పద్ధతి అంటే ఏంటి?

image

సాంద్ర పద్ధతిలో గొర్రెలు ఎప్పుడూ పాకల్లోనే ఉంటాయి. వీటికి నిర్ణీత మోతాదులో పచ్చిగడ్డి, దాణాను ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. జీవాల లెక్కింపు, మందులు, టీకాలు వేయడం ఈ విధానంలో సులభంగా ఉంటుంది. పశుగ్రాసం వృథాకాదు. అయితే పాకలను పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్లలోనికి గాలి వెలుతురు సరిగా ప్రసరించేలా చూడాలి. పచ్చి పశుగ్రాసాలను చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా చేసి దాణా తొట్లలో అందించాలి.

News January 5, 2026

మక్తల్: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కెమిస్ట్రీలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఈ నారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55% మార్కులతో పాసై ఉండాలని అలాగే నెట్, సెట్, పీహెచ్డీ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 8వ తేదీన ఎంపిక పరీక్ష ఉంటుందన్నారు.

News January 5, 2026

రాశీకి క్షమాపణలు చెప్పిన అనసూయ

image

సీనియర్ హీరోయిన్ <<18762425>>రాశీకి<<>> నటి అనసూయ క్షమాపణలు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని Xలో పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలు రాయించి, డైరెక్ట్ చేసిన వ్యక్తిని ఆ రోజునే నిలదీయాల్సి ఉండగా ఆ టైమ్‌కి తన శక్తి సరిపోలేదన్నారు. మనుషులు మారుతారని, ఆ షో విడిచి పెట్టాక తనలో మార్పును గమనించాలని కోరారు. గతంతో పోలిస్తే తాను శక్తిమంతంగా మారానన్నారు.