News January 24, 2025
గద్వాల: రూ.63.25 కోట్లతో తాగునీటి పథకం ప్రారంభం

గద్వాల మున్సిపల్ పరిధిలో వచ్చే 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య ఉండకుండా అమృత్ 2.0 పథకం కింద చేపట్టే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గద్వాల పట్టణంలో నది అగ్రహారం ఫిల్టర్ బెడ్ వద్ద అమృత్ 2.O పథకం కింద రూ.63.25 కోట్ల వ్యయంతో నీటి సరఫరా అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ సంతోష్ తో శంకుస్థాపన చేశారు.
Similar News
News December 13, 2025
కొలనుపాక: గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థి సన్మానం

కొలనుపాకలో ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ సర్పంచిగా విజయం సాధించారు. అయితే విజయాలు, అపజయాలు సహజమని, గ్రామ అభివృద్ధి ముఖ్యమని భావించిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భీమగాని హేమలత సంతోష్.. యాకమ్మను సన్మానించారు. దీనిపై యాకమ్మ స్పందిస్తూ గ్రామ అభివృద్ధికి ఆమె సలహాలు, సూచనలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
News December 13, 2025
వరంగల్ NIT అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానస్పద మృతి

ధర్మసాగర్ రిజర్వాయర్లో పడి వరంగల్ ఎన్ఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి(43) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేల్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 13, 2025
MNCL: జీపీ ఎన్నికలు.. సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు

ఈనెల 14న జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంచిర్యాల జిల్లాలలోని బెల్లంపల్లి, కన్నెపల్లి, భీమిని, తాండూర్, నెన్నెల, కాసిపేట, వేమనపల్లి మండలాల్లో 12వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 14న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యే వరకు సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.


