News March 20, 2025

గద్వాల: రేషన్ కార్డు లేక లబ్ధిదారుల అవస్థలు

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసమని ఈ మధ్యకాలంలో చాలామంది పాత రేషన్ కార్డు నుంచి పేరు తొలగించుకున్నారు. ఇలాంటి వారు అనేక మంది రేషన్ కార్డు లేకపోవడంతో పథకానికి దూరం అవుతున్నామని గద్వాల జిల్లాలోని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 16, 2025

సిరిసిల్లల: ఈ నెల16 నుంచి 18 వరకు క్రీడల పోటీలు

image

అండర్ 14, 17 బాల బాలికల క్రీడల పోటీలను సిరిసిల్ల రాజీవ్ నగర్‌లోని మినీ స్టేడియంలో నిర్వహిస్తామని SGF సెక్రటరీ నర్రా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 16 నుంచి 18 వరకు క్రీడల పోటీలు నిర్వహిస్తామని వివరించారు. 16న అథ్లెటిక్స్ లో రన్నింగ్ ఈవెంట్స్, 17న అథ్లెటిక్స్ లో జంపింగ్, త్రోయింగ్ ఈవెంట్స్, ఈనెల 18న బాలికలకు కోకో పోటీలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

News September 16, 2025

కర్నూలు: సత్తా చాటిన కడప జట్లు

image

కర్నూలులో రెండు రోజుల పాటు 17వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. బాలురు, బాలికల విభాగంలో కడప జట్టు మొదటి స్థానంలో నిలిచి డబుల్ క్రౌన్ సాధించింది. కర్నూలు బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. విజేతలకు జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షుడు రామాంజనేయులు, ఏపీ హ్యాండ్ బాల్ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు బహుమతులు అందజేశారు.

News September 16, 2025

భద్రాచలం: APలో కలిశాక ఆ 5 గ్రామాల పరిస్థితి దుర్భరం

image

AP-TG విభజన సమయంలో APలో కలిసిన 5 గ్రామాల ప్రజల జీవనం ఆగమ్యగోచరంగా మారింది. సరిహద్దుల్లో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు, గుండాల, పురుషోత్తపట్నంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ గ్రామాలు భద్రాచలానికి 9 KM, రంపచోడవరంనకు 130 KM దూరంలో ఉన్నాయి. దీంతో విద్యార్థుల చదువులు, అభివృద్ధి దుర్భరంగా తయారయ్యాయంటున్నారు. తమను తిరిగి భద్రాచలంలో చేర్చాలని కోరుతున్నారు.