News March 20, 2025
గద్వాల: రేషన్ కార్డు లేక లబ్ధిదారుల అవస్థలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసమని ఈ మధ్యకాలంలో చాలామంది పాత రేషన్ కార్డు నుంచి పేరు తొలగించుకున్నారు. ఇలాంటి వారు అనేక మంది రేషన్ కార్డు లేకపోవడంతో పథకానికి దూరం అవుతున్నామని గద్వాల జిల్లాలోని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 13, 2025
గుమ్మం ముందు కూర్చొని ఈ పనులు చేస్తున్నారా?

ఇంటి గుమ్మంపై కూర్చోవడం, జుట్టు దువ్వడం, తినడం, అడుగు పెట్టడం వంటి పనులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుందని అంటున్నారు. అలాగే తలుపు దగ్గర ఓ కాలు లోపల, మరో కాలు బయట పెట్టి నిలబడటం కూడా మంచిది కాదని చెబుతున్నారు. గుమ్మాన్ని కూడా దైవంలా భావించాలని, పూజించాలని ఫలితంగా శుభం కలుగుతుందని వివరిస్తున్నారు. SHARE IT
News December 13, 2025
14 నుంచి తిరుపతి ఐఐటీలో ఇంటర్ స్పోర్ట్స్

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ 14వ తేదీ నుంచి 21 తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. చెస్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఐకాన్ వెయిట్ లిఫ్టర్ సతీష్ శివలింగం హాజరుకానున్నారు.
News December 13, 2025
రానున్న 3 రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి (D) కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదైంది. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది.


